Skip to main content

UPSC Civils Ranker : ఓట‌మిలోనే.. విజ‌యం దొరికిందిలా..

యూపీఎస్సీ-2021 సివిల్స్ ఫ‌లితాల్లో వరంగల్‌ అండర్‌ రైల్వేగేట్‌ ప్రాంతం కరీమాబాద్‌ తోట్లవాడకు చెందిన పార్వతి రంజిత్‌కుమార్‌ 574వ ర్యాంకు సాధించాడు. ఈయ‌న వరంగల్‌లోని జవహర్‌ నవోదయ పాఠశాలలో చదువుకున్నాడు. భాష్యం కళాశాలలో ఇంటర్‌, నిట్‌ రాయపురలో విద్యాభ్యాసం కొనసాగించాడు. 2018లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసి రెండేళ్లు ఉద్యోగం చేశాడు. 2020లో మొదటిసారి ప్రయత్నించి విఫలమైనా ప్రస్తుతం 574వ ర్యాంకు సాధించాడు. చిన్నప్పటి నుంచి చదువుల్లో రాణించే తమ కుమారుడు సివిల్స్‌లో ఉత్తమ ర్యాంకు సాధించడంపై తల్లిదండ్రులు సంతోషం వ్యక్తంచేశారు.రంజిత్‌ తండ్రి కృష్ణంరాజు . తల్లి మాధవి. సోద‌రి రష్మిక ఉన్నారు. ఈ నేప‌థ్యంలో.. యూపీఎస్సీ సివిల్స్‌ ర్యాంక‌ర్ రంజిత్ కుమార్‌తో సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్ ప్ర‌త్యేక ఇంట‌ర్య్వూ.. 

Photo Stories