Skip to main content

TS TET 2023 Exam: టెట్‌కు 12,238 మంది హాజరు

TS TET 2023 Exam completed

సూర్యాపేట టౌన్‌: ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌) శుక్రవారం జిల్లా కేంద్రంలో ప్రశాంతంగా జరిగింది. రెండు సెషన్లలో పరీక్షను నిర్వహించారు. పేపర్‌–1ను ఉదయం 9.30గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, పేపర్‌–2ను మధ్యాహ్నం 2.30గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు నిర్వహించారు. జిల్లాలో 31 సెంటర్లలో పేపర్‌–1 పరీక్షకు 6,664 మంది అభ్యర్థులకు గాను 6,175 మంది హాజరయ్యారు. 489 మంది గైర్హాజరయ్యారు. అలాగే 29 సెంటర్లలో పేపర్‌–2 పరీక్షకు 7,397 మంది అభ్యర్థులను గాను 6,063 మంది హాజరుకాగా 1,334 మంది గైర్హాజరయ్యారు. మొత్తంగా రెండు పరీక్షలకు 12,238 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ప్రతి సెంటర్‌ వద్ద పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంలోని పలు సెంటర్లను అదనపు కలెక్టర్‌ వెంకట్‌రెడ్డి, జిల్లా పరిశీలకుడు నర్సింహ, జిల్లా విద్యాశాఖ అధికారి కె.అశోక్‌ తనిఖీ చేశారు. ఇదిలా ఉండగా సూర్యాపేటలో కొందరు చిన్నపిల్లల తల్లులు పరీక్ష రాయడానికి వెళ్లడంతో చిన్నారుల తండ్రులు, బంధువులు వారిని ఆడిస్తూ కేంద్రాల సమీపంలో కనిపించారు.

చదవండి: TS TET 2023 Exam: ప్రశాంతంగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష

Published date : 16 Sep 2023 03:17PM

Photo Stories