Skip to main content

Telangana: 15, 19న గణిత ప్రతిభా పరీక్షలు

కామారెడ్డి టౌన్‌: జాతీయ గణిత దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను ప్రోత్సహించేందుకు గణిత దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గణిత ప్రతిభా పరీక్షలను విజయవంతంగా నిర్వహించాలని డీఈవో ఎస్‌ రాజు ఉపాధ్యాయులకు సూచించారు.
 Math Aptitude Tests on 15th and 19th  Celebrating National Maths Day in Kamareddy Town

ఈ మేరకు డిసెంబ‌ర్ 12న‌ఉత్తర్వులు జారీ చేశారు. మండల స్థాయిలో డిసెంబ‌ర్ 15న, జిల్లా స్థాయిలో 19వ తేదీన డివిజన్‌ కేంద్రాల్లో పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

చదవండి: NCERT: మేథ్స్‌లో మనోళ్లు తగ్గుతున్నారు

కార్యక్రమంలో తెలంగాణ గణితఫోరం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తాడ్వాయి శ్రీనివాస్‌, జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్‌, ప్రధాన కార్యదర్శి రామారావు, కోశాధికారి నరేందర్‌, డివిజన్‌ అధ్యక్షుడు రామకృష్ణ, సిద్ధిరామాగౌడ్‌, విష్ణువర్ధన్‌ తదితరులు పాల్గొన్నారు. Sakshi Education Whatsapp Channel Follow

Published date : 13 Dec 2023 03:06PM

Photo Stories