Skip to main content

ఏపీ డీఎస్సీకి 6,06,705 దరఖాస్తులు

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ-2018కి దరఖాస్తు సమర్పణ చివరి రోజు నవంబర్ 18 రాత్రి తొమ్మిది గంటల వరకు 6,06,705 దరఖాస్తులు అందాయి.
అత్యధికంగా సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు 3,43,623 మంది దరఖాస్తు చేశారు. భాషా పండితుల పోస్టులకు 24,206 మంది, స్కూల్ అసిస్టెంట్స్ (లాంగ్వేజెస్) పోస్టులకు 31,630 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇక స్కూల్ అసిస్టెంట్స్ (మ్యాథ్స్) పోస్టులకు 25,734 మంది, బయోలాజికల్ సైన్స్ పోస్టులకు 23,521 మంది, సోషల్ స్టడీస్ పోస్టులకు 56,638 మంది నుంచి దరఖాస్తులు వచ్చాయి.
Published date : 19 Nov 2018 02:54PM

Photo Stories