Skip to main content

డీఎస్సీ-2018 ఫీజు గడువు నవంబర్ 17కు పెంపు

సాక్షి, అమరావతి: డీఎస్సీ-2018 దరఖాస్తు రుసుము చెల్లించేందుకు నవంబర్ 17 వరకు గడువు పొడిగించినట్లు ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్య కమిషనర్ కె.సంధ్యారాణి ఒక ప్రకటనలో తెలిపారు.
అభ్యర్థులు ఆన్‌లైన్ దరఖాస్తులో చేసిన తప్పులను సరిచేసుకునేందుకు గడువు ఇవ్వటంతోపాటు, బీఈ, బీటెక్, బీబీఏ తదితర కోర్సులు చదివిన అభ్యర్థులకూ డీఎస్సీకి అవకాశం ఇచ్చినట్లు కమిషనర్ వివరించారు. నవంబర్ 18లోగా ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవాలన్నారు.
Published date : 14 Nov 2018 01:18PM

Photo Stories