Skip to main content

Botsa Satyanarayana: విదేశీ విద్యావకాశాలను సద్వినియోగం చేసుకోవాలి

సాక్షి ప్రతినిధి, విజయనగరం: గిరిశిఖర గ్రామాల్లోని గిరిజన విద్యార్థులు ప్రభుత్వం అందిస్తున్న విదేశీ విద్యావకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పిలుపునిచ్చారు.
Botsa Satyanarayana
విదేశీ విద్యావకాశాలను సద్వినియోగం చేసుకోవాలి

విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఏపీ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలోని ప్రతిభా పాఠశాలలు (స్కూల్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌), కళాశాల (కాలేజీ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌)ల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పరీక్ష ఫలితాలను మే 10న పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొరతో కలిసి బొత్స విడుదల చేశారు. ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరానికి 8వ తరగతిలో 190 సీట్లకు 878 మంది, ఇంటర్మీడియె­ట్‌­లో 450 సీట్లకు 3,548 మంది ప్రవేశపరీక్ష రాశారని చెప్పారు. విద్యార్థులకు వచ్చిన ర్యాంకుల ఆధారంగా సీట్లను కేటాయిస్తామన్నారు.

చదవండి: Foreign Education: విదేశీ విద్యకు రాష్ట్ర ప్రభుత్వం చేయూత

ఐఐటీ, మెడికల్‌ సీట్ల లక్ష్యంగా ప్రత్యేక శిక్షణ ఇస్తామని తెలిపారు. దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి 2005లో ప్రారంభించిన ప్రతిభా పాఠశాలలు, కళాశాలల్లో చదువుకున్న గిరిజన విద్యార్థులు పలు ఐఐటీలు, ఎన్‌ఐటీలు, మెడికల్‌ కాలేజీల్లో సీట్లు సాధిస్తున్నా­రని అభినందించారు. ప్రతిభావంతులకు విదేశీ ఉన్నత విద్యావకాశాలనూ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కల్పిస్తున్నారని వివరించారు. ఇప్పటి నుంచే లక్ష్యాలను నిర్దేశించుకొని గిరిజన విద్యా­ర్థులు ఆ అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూ­చిం­చారు. ఈ సందర్భంగా ఇటీవల విడుదలైన పదో తరగతి పరీక్ష ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను బొత్స, రాజన్నదొర సత్కరించారు. ఈ కార్యక్రమంలో గిరిజన గురుకు­లాల సంస్థ సంయుక్త కార్యదర్శి ఎస్‌.రమణమూర్తి, ఉప కార్యదర్శి రమేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

చదవండి: Study Abroad: విదేశీ విద్యకు.. ముందస్తు ప్రణాళిక!

Published date : 11 May 2023 04:00PM

Photo Stories