Skip to main content

Foreign Education: విదేశీ విద్యకు రాష్ట్ర ప్రభుత్వం చేయూత

బాలాజీచెరువు (కాకి నాడ సిటీ): విద్యపై పెట్టే వ్యయం విద్యార్థుల భవిష్యత్‌కు పెట్టుబడి అనే మహోన్నత ఆశయంలో సీఎం జగన్‌ విద్యారంగానికి వేల కోట్లు కేటాయిస్తున్నారని ఆంధ్రప్రదేశ్‌ ఉన్నత విద్యామండలి కార్యదర్శి ప్రొఫెసర్‌ నజీర్‌ అహ్మద్‌ చెప్పారు.
Foreign Education
విదేశీ విద్యకు రాష్ట్ర ప్రభుత్వం చేయూత

కాకినాడలోని జేఎన్‌టీయూ(కే)లో ఉన్నత విద్యామండలి, ఆప్‌ స్కిల్స్‌ ఆధ్వర్యంలో ఏపిల్‌ 17న స్టడీ అబ్రాయిడ్‌ ఫెయిర్‌–2023 నిర్వహించారు. ప్రొఫెసర్‌ నజీర్‌ అహా్మద్‌ మాట్లాడుతూ.. ఈ ఫెయిర్‌లో టాప్‌ 200 ర్యాంకింగ్‌ ఉన్న విదేశీ వర్సిటీలు పాల్గొనడం సంతోషమన్నారు. విద్యార్థులకు ట్యూషన్‌ ఫీజులు రీయింబర్స్‌మెంట్‌ ద్వారా ఏవిధంగా చెల్లిస్తారు తదితర వివరాలు తెలుసుకోవడానికి ఈ ఫెయిర్‌ ఉపయోగపడుతుందన్నారు.

చదవండి: VISA: దరఖాస్తు ఫీజులు పెంచిన అమెరికా

జేఎన్‌టీయూ(కే) వీసీ డాక్టర్‌ జీవీఆర్‌ ప్రసాద రాజు మాట్లాడుతూ దాదాపు ఎనిమిది జిల్లాల్లో ఉన్న ఇంజినీరింగ్, ఎంబీఏ ఫైనలియర్‌ విద్యార్థులు విదేశీ విద్య, అక్కడ వర్సిటీల విధానాలు తదితర వివరాలు తెలు­సుకోవడానికి ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడిందన్నారు. ఫెయిర్‌లో 2,500 మంది విద్యార్థులు పాల్గొని సందేహాలు నివృత్తి చేసుకున్నారు. వర్సిటీ రెక్టార్‌ కేవీ రమణ, రిజి్రస్టార్‌ సుమలత తదితరులు పాల్గొన్నారు.

చదవండి: Study Abroad: విదేశీ విద్యకు.. ముందస్తు ప్రణాళిక!

Published date : 18 Apr 2023 04:12PM

Photo Stories