Jobs: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో లెక్చరర్ పోస్టులకు దరఖాస్తులు
Sakshi Education
శాంతినగర్: ప్రభుత్వ డిగ్రీ కళాశాల శాంతినగర్లో 2023–24 విద్యా సంవత్సరానికి తెలుగు–1 బోధించేందుకు గెస్ట్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ డా.కె.చంద్రశేఖర్ నవంబర్ 6న ఒక ప్రకటనలో తెలిపారు.
![Academic Year 2023-24 Application Notice, Dr. K. Chandrasekhar, College Principal, Guest Lecturer Position for Teaching Telugu-1, Applications for Guest Lecturer Posts, Government Degree College Shantinagar Announcement,](/sites/default/files/images/2023/12/19/teacher2mr-1702962059.jpg)
ఎస్సీ, ఎస్టీలకు 50 శాతం, ఇతరులకు 55 శాతం ఉత్తీర్ణత కలిగి ఉండి పీహెచ్డీ, నెట్, సెట్ అర్హత కలిగి బోధన అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తామన్నారు.
నవంబర్ 8, 9 తేదీల్లో ఉదయం 11 గంటలకు ఎంఏఎల్డీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల గద్వాలలో ఇంటర్వ్యూలు ఉంటాయని పేర్కొన్నారు.
చదవండి:
Good News for Inter students: ఇంటర్ విద్యార్థులకు తీపి కబురు
Published date : 07 Nov 2023 03:03PM