Skip to main content

209 మందికి ఉపాధ్యాయ ఉద్యోగాలు

కర్నూలు సిటీ: పాతికేళ్ల కల నెరవేరింది. డీఎస్సీ–1998లో అర్హత సాధించి, మెరిట్‌ లిస్టులో ఉన్న 209 మంది అభ్యర్థులకు ఉపాధ్యాయ ఉద్యోగాలు రానున్నాయి.
209 teaching jobs
209 మందికి ఉపాధ్యాయ ఉద్యోగాలు

వీరిని మినిమం టైం స్కేలు(ఎంటీఎస్‌)పై కాంట్రాక్టు ఎస్జీటీ(సెకండరీ గ్రేడ్‌ టీచర్‌)లుగా నియమించనున్నారు. ఇటీవలే పాఠశాల విద్యాశాఖ పోస్టుల భర్తీకి సంబంధించిన షెడ్యూల్‌ను జారీ చేసింది. ఏప్రిల్ 10న‌ జిల్లా సెలక్షన్‌ కమిటీ ఆ పోస్టులకు ఆమోద ముద్ర వేసింది. 1998 డీఎస్సీలో అర్హత పొందిన వారిని మెరిట్‌ ప్రాతిపదికన ఈ పోస్టుల్లో భర్తీ చేయనున్నారు.

చదవండి:

EAMCET 2023: ఎంసెట్‌కు ఇన్ని లక్షల దరఖాస్తులు.. ఈసారి పరీక్ష ఇలా..

TSPSC: ‘అడ్డదారి అభ్యర్థుల’ గుర్తింపే లక్ష్యం

9,231 Jobs: అవరోహణ విధానంలో గురుకుల పోస్టుల భర్తీ

Fake Job Notification: ఉద్యోగాల పేరుతో నకిలీ వెబ్‌సైట్‌

జిల్లాలో మొత్తం 209 మందికి ఉపాధ్యాయ ఉద్యోగాలు రానున్నాయి. ఉద్యోగాలకు ఎంపికై న వారికి మంగళవారం సమాచారం ఇవ్వనున్నారు. షెడ్యూల్‌ ప్రకారం ఏప్రిల్ 12న నగరంలోని ఎ.క్యాప్‌ మాంటిస్సోరి స్కూల్‌లో ఎంపికై న వారికి నియామాక పత్రాలను ఇవ్వనున్నారు. వీరిని ఏకోపాధ్యాయ స్కూళ్లలోను, విద్యార్థుల సంఖ్య ఎక్కువ ఉండి, తక్కువ మంది టీచర్లు పనిచేస్తున్న పాఠశాలల్లోనూ నియమించనున్నారు. వీరందరికీ ఈ వేసవిలో శిక్షణ ఇవ్వనున్నారు.

 

Published date : 11 Apr 2023 05:03PM

Photo Stories