Skip to main content

Velugu Abhyasamithra: విద్యార్థుల్లోని సామర్థ్యాలు వెలికితీయాలి: నోడల్‌ అధికారి వెంకటయ్య

మాగనూర్‌: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సామర్థ్యాలను ఉపాధ్యాయులు వెలికి తీయాలి నోడల్‌ అధికారి వెంకటయ్య చెప్పారు.
ఉపాధ్యాయుల సమావేశంలో నోడల్‌ అధికారి వెంకటయ్య
ఉపాధ్యాయుల సమావేశంలో నోడల్‌ అధికారి వెంకటయ్య

మండల కేంద్రంలోని మండల వనరుల కార్యాలయంలో మండల ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయులకు వెలుగు అభ్యాసమిత్ర కార్యక్రమంలో భాగంగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నోడల్‌ అధికారి వెంకటయ్య మాట్లాడుతూ.. మండలంలోని ప్రతి ఉపాధ్యాయుడు సమయపాలన పాటిస్తూ కలెక్టర్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వెలుగు అభ్యాసమిత్ర కార్యక్రమాన్ని ప్రతి ఉపాధ్యాయుడు సూచనల ప్రకారం నడుచుకోవాలని సూచించారు. ప్రతి పాఠశాలలో సీ–గ్రేడ్‌ విద్యార్థుల సంఖ్యను తగ్గించాలని తెలిపారు.

Also read: Primary School Level: ఉపాధ్యాయులు ఇంగ్లిష్‌పై పట్టుసాధించాలి

ఈ కార్యక్రమం ద్వారా పాఠశాలలు బలోపేతం కావాలని, ఇందుకుగాను ఉపాధ్యాయులంతా సహకరించాలని కోరారు. మాగనూర్‌ కాంప్లెక్స్‌ ప్రధానోపాధ్యాయులు నర్సిములు మాట్లాడుతూ.. ప్రతి ఉపాధ్యాయుడు చక్కని అవగాహనతో విద్యార్థుల సామర్‌ాధ్యలను వెలికి తీసేలా పనిచేయాలని చెప్పారు. 

also read: Sports School: ఆగస్టు 13న క్రీడా పాఠశాలల్లో రాష్ట్రస్థాయి ఎంపికలు

Published date : 10 Aug 2023 03:24PM

Photo Stories