Govt Schools: తరగతి గదుల ప్రారంభం
Sakshi Education
![Opening of New Classrooms](/sites/default/files/images/2023/11/11/new-classrooms-1699696159.jpg)
బొమ్మనహళ్లి : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసించే ప్రతి ఒక్కరూ పట్టుదలతో చదువుకుని ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులతో పోటీగా రాణించాలని ఎమ్మెల్యే ఎం.సతీష్ రెడ్డి అన్నారు. నవంబర్ 10న శుక్రవారం నగరంలోని బొమ్మనహళ్ళి పరిధి అగర గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో కొత్తగా నిర్మించిన నూతన తరగతి గదులను ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో అనేక సౌకర్యాలు కల్పిస్తున్నారని, వాటిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో కార్పోరేటర్ గురుమూర్తి రెడ్డి, స్థానిక నాయకులు ఎ.ఎం.నరసింహమూర్తి, తిమ్మారెడ్డి, వెంకటరమణప్ప తదితరులు పాల్గొన్నారు.
చదవండి: Skill Training for Students: విద్యార్థులకు వృత్తి నైపుణ్య శిక్షణ
Published date : 11 Nov 2023 03:19PM