Skip to main content

పాఠశాలల్లో ఐడియా కాంపిటేషన్‌ నిర్వహించాలి

Idea competition in schools
Idea competition in schools

గండేపల్లి: ప్రతి పాఠశాలలోనూ ఐడియా కాంపిటేషన్‌ నిర్వహించాలని ఆర్‌జేడీ జి.నాగమణి ఉపాధ్యాయులకు సూచించారు. మండలంలోని సూరంపాలెం ఆదిత్య క్యాంపస్‌లో బుధవారం నిర్వహించిన ఎంఈఓ కాంప్లెక్స్‌ హెచ్‌ఎం, సీఆర్పీల జిల్లాస్థాయి సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉపాధ్యాయులు ప్రతి తరగతి నుంచి ఉత్తమ ఐడియాను ప్రాజెక్టుగా మలచి వెబ్‌సైట్లో అప్‌లోడ్‌ చేయాలన్నారు. కాకినాడ జిల్లాకు సంబంధించి 2023–24 విద్యా సంవత్సరానికి గాను అన్ని ఉన్నత పాఠశాలల్లోనూ 6 నుంచి 10వ తరగతి వరకూ తరగతికి ఒకటి చొప్పున ఐదు ప్రాజెక్టులు, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 6 నుంచి 8వ తరగతి వరకూ తరగతికి ఒకటి చొప్పున మూడు ప్రాజెక్టులు వెబ్‌సైట్లో అప్‌లోడ్‌ చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఉప విద్యాశాఖాధికారి డేనియల్‌ రాజు, సుభద్ర, హెచ్‌ఎంలు పాల్గొన్నారు.

Published date : 10 Aug 2023 04:15PM

Photo Stories