ఏలూరు(మెట్రో): జిల్లాలో కురుస్తున్న అధిక వర్షాల కారణంగా కుక్కునూరు, వేలేరుపాడు, పోలవరం, బుట్టాయగూడెం మండలాల్లోని పాఠశాలలు, ఇంటర్మీడియెట్ కళాశాలలకు జూలై 27, 28న సెలవు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్ ఓ ప్రకటనలో తెలిపారు.
విద్యాసంస్థలకు సెలవు
వర్షాలతో పాటు గోదావరికి వరద ఉధృతి పెరుగుతున్న కారణంగా ఆయా మండలాల్లో సెలవులు ప్రకటిస్తున్నట్టు పేర్కొన్నారు. జూలై 29, 30న కూడా సెలవు రోజులు కావడంతో ప్రభుత్వ హాస్టళ్లలోని విద్యార్థులను వారి ఇళ్లకు పంపవద్దని, అత్యవసర పరిస్థితుల్లో వెళ్లే వారిని మాత్రమే అనుమతిస్తూ బృందాలుగా పంపించాలని ఆదేశించారు. ఈ బాధ్యతను ఉపాధ్యాయులకు అప్పగించి విద్యార్థులను ఇంటి వద్ద క్షేమంగా చేర్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.