State Level Parliamentary Contests: విద్యార్థులకు అభినందన
Sakshi Education
హైదరాబాద్లోని తిరుమలగిరిలో గల కేంద్రీయ విద్యాలయంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పార్లమెంట్ పోటీల్లో కొత్తూరు కేంద్రియ విద్యార్థులు ప్రథమ స్థానంలో నిలిచి ట్రోఫీని అందుకున్నారు.
విద్యార్థులకు అభినందన
విజేతలను సెప్టెంబర్ 29న అభినందించిన అనంతరం ప్రిన్సిపల్ శంకరయ్య మాట్లాడారు. ఆరు కేంద్రీయ విద్యాలయాలు తలపడగా, తమ స్కూల్ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ చూపడంపై ఆనందం వ్యక్తం చేశారు.
నవంబర్లో నిర్వహించనున్న జోనల్ స్థాయి పోటీలకు అర్హత సాధించారని పేర్కొన్నారు. విద్యార్థులకు శిక్షణ ఇచ్చిన ఉపాధ్యాయులు జోషీబాబు, దొరసానమ్మకు అభినందనలను తెలియజేశారు. ఉపాధ్యాయులు రవి, అశోక్, సంధ్యశర్మ తదితరులు పాల్గొన్నారు.