Skip to main content

Admissions in PJTSAU: పీజేటీఎస్‌ఏయూ, హైదరాబాద్‌లో వివిధ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు..

Admissions in various Diploma Courses at PJTSAU Hyderabad

హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ స్టేట్‌ అగ్రికల్చరల్‌ యూనివర్శిటీ (పీజేటీఎస్‌ఏయూ).. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ పాలిటెక్నిక్‌ కాలేజీల్లో 2022–23 విద్యా సంవత్సరానికి వివిధ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.

కోర్సుల వివరాలు
డిప్లొమా ఇన్‌ అగ్రికల్చర్‌: కోర్సు వ్యవధి:రెండేళ్లు; డిప్లొమా ఇన్‌ ఆర్గానిక్‌ అగ్రికల్చర్‌: కోర్సు వ్యవధి: రెండేళ్లు;డిప్లొమా ఇన్‌ అగ్రికల్చరల్‌ ఇంజనీరింగ్‌: కోర్సు వ్యవధి: మూడేళ్లు. ఈ మూడు డిప్లొమా కోర్సులు ఇంగ్లిష్‌ మీడియంలో బోధిస్తారు.
అర్హత: పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి. అగ్రికల్చరల్‌ స్ట్రీమ్‌లో పాలీసెట్‌ 2022 పరీక్ష రాసి ఉండాలి.
వయసు: 15 నుంచి 22 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: పాలీసెట్‌ 2022 అగ్రికల్చర్‌ స్ట్రీమ్‌లో సాధించిన ర్యాంకు ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది:13.08.2022

వెబ్‌సైట్‌: https://www.pjtsau.edu.in/

Last Date

Photo Stories