Skip to main content

Dsc Notification: నిరుద్యోగుల‌కు గుడ్‌న్యూస్‌... త్వ‌ర‌లోనే డీఎస్సీ నోటిఫికేష‌న్‌

నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ శుక్ర‌వారం(ఏప్రిల్ 21న‌) వెల్లడించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దీనిపై విధానపరమైన నిర్ణయం తీసుకుంటారన్నారు.
Dsc Notification
Dsc Notification

చ‌ద‌వండి: న‌ర్సింగ్ విద్యార్థుల‌కు శుభ‌వార్త‌... రూ.80 వేల జీతంతో కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగాలు 

రాష్ట్రంలో తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దశల వారీగా టీచర్‌ పోస్టులు భర్తీ చేశామని బొత్స చెప్పారు. సీఎం జగన్‌ ఆదేశాల మేరకు ప్రస్తుతం ఉండాల్సిన టీచర్‌ పోస్టులు ఎన్ని? వాటిలో ఎన్ని పోస్టు­లు భర్తీ అయ్యాయి? ఇంకా ఎన్ని పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది? అనే అంశాలపై నివేదిక సిద్ధం చేస్తున్నామన్నారు.

botsa

నివేదికను సీఎంకు వివరించి ఆ­య­న ఆదేశాల మేరకు ఖాళీగా ఉన్న పో­స్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నామని వివ‌రించారు.

చ‌ద‌వండి: ప‌రీక్ష లేకుండానే 70 వేల జీతంతో నేష‌న‌ల్ సోలార్ ఎన‌ర్జీలో ఉద్యోగాలు.. పూర్తి వివ‌రాలు ఇవే
పార‌ద‌ర్శ‌కంగా బ‌దిలీలు..!
అలాగే ఉపాధ్యాయులు, ఉద్యోగుల బదిలీలపై సమీక్షించినట్లు బొత్స వెల్ల‌డించారు. త్వరలో బదిలీలపై నిర్ణయం తీసుకుంటామ‌న్నారు. పూర్తి పార‌ద‌ర్శ‌కంగా బదిలీలను చేప‌డ‌తామ‌న్నారు. ఇందు కోసం ఇతర రాష్ట్రాలలో అమ‌ల‌వుతున్న విధానాల‌ను ప‌రిశీలిస్తున్న‌ట్లు మంత్రి చెప్పారు.

Published date : 21 Apr 2023 01:55PM

Photo Stories