Job Mela in Andhra Pradesh: 4న జాబ్మేళా
Sakshi Education
![job fair on 4th in anantapur district andhra pradesh](/sites/default/files/images/2023/08/03/job-fair-1691050757.jpg)
అనంతపురం: ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 4వ తేదీన జాబ్మేళా నిర్వహించనున్నారు. ఈ మేరకు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎల్.ఆనంద్ రాజ్కుమార్ బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అనంతపురంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఏపీఎస్ఎస్డీసీ కార్యాలయంలో జరిగే ఇంటర్వ్యూలకు పది, ఇంటర్మీడియట్, డిగ్రీ, డిప్లొమో పూర్తి చేసిన అభ్యర్థులు హాజరు కావచ్చు. బయోడేటాతో పాటు ఆధార్ కార్డు, విద్యార్హత పత్రాలు తీసుకుని రావాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు 83175 20929కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు.
Published date : 03 Aug 2023 01:49PM