Skip to main content

Teachers: ఉపాధ్యాయుల సర్దుబాటు పారదర్శకంగా చేపట్టాలి

Adjustment of teachers should be done transparently

ఖమ్మం సహకారనగర్‌: ఎక్కువగా ఉన్న పాఠశాలల నుంచి ఇతర స్కూళ్లకు చేపడుతున్న ఉపాధ్యాయుల సర్దుబాటును పారదర్శకంగా నిర్వహించాలని టీపీటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌.విజయ్‌ కోరారు. ఈమేరకు శుక్రవారం డీఈఓ సోమశేఖరశర్మకు వినతిపత్రం అందజేసి మాట్లాడారు. నిబంధనల పాటిస్తూ, ఎక్కడా పైరవీలకు తావివ్వకుండా ప్రక్రియ పూర్తిచేయాలని విన్నవించారు. ఈకార్యక్రమంలో నాయకులు ఏ.వీ.నాగేశ్వరరావు, వెంగళరావు, మల్లయ్య, శ్యాంసుందర్‌, ఆకుల నాగేశ్వరరావు, జి.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
 

Government School Students: స్కూల్‌ డ్రెస్‌ ఏదీ?

Published date : 22 Jul 2023 04:04PM

Photo Stories