APPSC Group-1 Ranker Bharath Nayak Success Story : భరత్ అనే నేను.. డిప్యూటీ కలెక్టర్ అయ్యానిలా..
![APPSC Group-1 Ranker Bharath Nayak](/sites/default/files/images/2022/07/30/bharath-nayak-1659173518.jpg)
2018 డిసెంబర్లో మొత్తం 167 పోస్టుల నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో గ్రూప్–1లో ఫలితాల్లో తొమ్మిదో ర్యాంక్ సాధించి డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగానికి ఎంపికైన ఎస్.భరత్ నాయక్ సక్సెస్ స్టోరీ మీకోసం..
భరత్ అనే నేను.. గ్రూప్–1లో..
శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం సెరికల్చర్ విభాగం రిటైర్డ్ ప్రొఫెసర్ ఎస్.శంకర్ నాయక్ కుమారుడు ఎస్.భరత్ నాయక్ గ్రూప్–1 ఫలితాల్లో రాష్ట్రస్థాయి తొమ్మిదో ర్యాంకుతో డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం సాధించారు. ఎంబీబీఎస్ పూర్తి చేసిన ఈయన 2016 గ్రూప్–1లో ఎక్సైజ్ సూపరింటెండెంట్గా ఎంపికయ్యారు. ప్రస్తుతం కర్నూలులో పనిచేస్తున్నారు. ఉద్యోగం చేస్తూనే 2018 గ్రూప్–1 పరీక్ష రాసి డిప్యూటీ కలెక్టర్ పోస్టు సాధించారు. అమ్మ ఎస్.శాంతాబాయి డిప్యూటీ ట్రెజరీ ఆఫీసర్గా పదవీ విరమణ పొందారు. అమ్మా నాన్న ప్రోత్సాహంతోనే గ్రూప్–1లో విజయం సాధించినట్లు భరత్ తెలిపారు.
☛ Success Story: ఎలాంటి కోచించి లేకుండానే.. సివిల్స్లో 74వ ర్యాంక్ కొట్టానిలా..
ఇతర కారణాల వల్ల..
2018 డిసెంబర్లో మొత్తం 167 పోస్టుల (2 స్పోర్ట్స్ కోటాతో కలిపి) నోటిఫికేషన్ ఇచ్చారు. 2019 మేలో గ్రూప్–1 ప్రిలిమ్స్కు 1,14,473 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీరిలో 58,059 మంది మెయిన్స్కు అర్హత సాధించారు. తరువాత కరోనా, ఇతర కారణాల వల్ల మెయిన్స్ పరీక్షలు మూడుసార్లు వాయిదా పడ్డాయి. 2020 డిసెంబర్లో మెయిన్స్ పరీక్షలను ట్యాబ్ ఆధారిత ప్రశ్నపత్రాలతో అత్యంత పకడ్బందీగా నిర్వహించారు. తొలిసారిగా గ్రూప్–1 సమాధాన పత్రాల మూల్యాంకనాన్ని డిజిటల్ విధానంలో చేశారు. 2021 ఏప్రిల్లో వీటి ఫలితాలు విడుదల చేయగా కొంతమంది అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఇచ్చిన తీర్పుతో మూల్యాంకనాన్ని సంప్రదాయ పద్ధతిలో మ్యాన్యువల్గా అత్యంత పారదర్శకంగా చేయించారు. మొత్తం మూల్యాంకన ప్రక్రియను సీసీ కెమెరాల్లో చిత్రీకరించి భద్రపరిచారు. అనంతరం మూడు బోర్డులను ఏర్పాటు చేసి ఇంటర్వ్యూలను పూర్తి చేశారు. బోర్డుల్లో కూడా కమిషన్ సభ్యులు ఇద్దరితోపాటు ఇద్దరు ఆలిండియా సర్వీసు సీనియర్ అధికారులు, సబ్జెక్టు నిపుణులు ఉన్నారు.