Skip to main content

World Record: వరల్డ్‌ రికార్డు నమోదు చేసిన బిహార్‌ వాసి

బిహార్‌లోని కైమూర్‌ జిల్లా రామ్‌గఢ్‌కు చెందిన ధర్మేంద్ర కుమార్‌ సరికొత్త రికార్డ్‌ను నమోదు చేశారు.

165 కిలోల బరువును తన పళ్లతో పది సెకన్లపాటు పైకిలేపి ప్రపంచ రికార్డు నమోదు చేశారు. త్రిపురలోని అగర్తలాకు చెందిన నేతాజీ వరల్డ్‌ రికార్డ్‌ ఫౌండేషన్‌ నిర్వహించిన పోటీల్లో ఈ అరుదైన రికార్డ్‌ను ధర్మేంద్ర కుమార్‌ సొంతం చేసుకున్నారు. ధర్మేంద్ర ఇప్పటివరకు 9 ప్రపంచ రికార్డుల్లో స్థానం సంపాదించారు. ‘హ్యామర్‌ హెడ్మాన్‌ ఆఫ్‌ ఇండియా’గా ఈయన పేరుపొందారు.

Published date : 09 Feb 2023 03:52PM

Photo Stories