Skip to main content

TS EAMCET 2022 : టీఎస్ ఎంసెట్ బ్రేకింగ్ న్యూస్‌.. అగ్రికల్చర్ ప‌రీక్ష వాయిదా..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ‌లో అనూహ్యంగా నెలకొన్న వాతావరణ పరిస్థితులు, ఎడతెరిపిలేని వర్షాల దృష్ట్యా జూలై 14వ తేదీ(గురువారం) నుంచి జరగాల్సిన అగ్రికల్చర్‌ పరీక్షను వాయిదా వేశారు.
TS EAMCET -2022
TS EAMCET 2022

ఈ మేర‌కు ఉన్నత విద్యామండలి అధికారులు ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. జూలై 18 నుంచి 20 వరకు జరగాల్సిన ఇంజినీరింగ్‌ ఎంసెట్‌ యథాతథంగా ఉంటుందని అధికారులు తెలిపారు. నేపథ్యంలో ఉన్నత విద్యామండలి అధికారులు పరిస్థితిని సమీక్షించారు. అలాగే ప్రభుత్వంతో సంప్రదించి అగ్రికల్చర్‌ పరీక్ష వాయిదా వేసి.. ఇంజినీరింగ్‌ పరీక్షను యథాతథంగా జరపాలని నిర్ణయించారు. వాయిదా వేసిన‌ అగ్రికల్చర్‌ పరీక్షల తేదీల‌ను త్వ‌ర‌లోనే వెల్ల‌డిస్తామ‌ని అధికారులు తెలిపారు.

 

ఎంసెట్ స్ట‌డీమెటీరియ‌ర్‌, సిల‌బ‌స్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్ కోసం క్లిక్ చేయండి

3 రోజులపాటు సెలవులు ప్రకటించడంతో..
రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండటం, అన్ని విద్యాసంస్థలకు ప్రభుత్వం 3 రోజులపాటు సెలవులు ప్రకటించడంతో పరీక్ష తేదీల మార్పుపై అధికారులు తొలుత కసరత్తు చేశారు. కానీ మండలి సాంకేతిక కన్సల్టెన్సీ సంస్థ మాత్రం ఎంసెట్‌ వాయిదాపై అభ్యంతరం వ్యక్తం చేసింది. జాతీయ స్థాయిలో పలు పరీక్ష తేదీలను దృష్టిలో పెట్టుకొని ఎంసెట్‌ తేదీలు ఖరారు చేసినందున ఇప్పుడు మార్చడం సాధ్యం కాదని ఉన్నత విద్యామండలికి సూచించింది.

TS ECET 2022 Postponed: టీఎస్ ఈసెట్ ప‌రీక్ష వాయిదా.. ఎంసెట్ మాత్రం..!

ఈ సారి ఎంసెట్ విపరీతమైన పోటీ..
ఈసారి తెలంగాణ ఎంసెట్‌కు కూడా విపరీతమైన పోటీ ఉంది. ఇంజనీరింగ్‌కు 1,71,945, అగ్రికల్చర్, మెడికల్‌కు 94,150, రెండింటికీ దరఖాస్తు చేసినవారు 350, మొత్తం 2,66,445 దరఖాస్తులు వ‌చ్చాయి. గతేడాదితో పోలిస్తే ఈసారి 14,722 దరఖాస్తులు ఎక్కువ వచ్చాయి.

Engineering‌ Admissions: బీటెక్‌లో ప్రవేశాలకు సిద్ధమవుతున్నారా... అయితే ఇది మీ కోస‌మే!

ఏపీ, తెలంగాణలో 109 కేంద్రాలు ఏర్పాటు.. కానీ
ఎంసెట్ ఆన్‌లైన్‌ విధానంలో పరీక్ష నిర్వహిస్తున్న కారణంగా విద్యుత్, ఇంటర్నెట్‌ సదుపాయాలు తప్పకుండా ఉండాల్సిందే. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఈ రెండు మౌలిక సదుపాయాలకు అంతరాయం ఏర్పడే అవ‌కాశం ఉంది. బేటరీలు, ఇన్వర్టర్లు, జనరేటర్ల సాయంతో పరీక్షలు నిర్వహించినా, చాలామంది విద్యార్థులు పరీక్షాకేంద్రాలకు చేరుకోవడమే కష్టంగా ఉంటుంది. పరీక్షల కోసం ఏపీ, తెలంగాణలో 109 కేంద్రాలు ఏర్పాటు చేశారు.

బీటెక్‌లో ఈసీఈతో బంగారు భవిత అందుకోండి.. కెరీర్‌లో దూసుకెళ్లండి..

ఇటీవ‌లే ఈసెట్ ప‌రీక్ష‌ను కూడా..
జూలై 13వ తేదీ(బుధ‌వారం) జరగాల్సిన టీఎస్ ఈసెట్‌ ప‌రీక్ష‌ను కూడా వాయిదా వేసిన విష‌యం తెల్సిందే.ఈ మేర‌కు ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. అలాగే ఈసెట్‌ మళ్లీ ఎప్పుడు నిర్ణయించాలనే విషయాన్ని త్వ‌ర‌లోనే వెల్ల‌డిస్తామ‌ని ప్రొఫెసర్‌ లింబాద్రి పేర్కొన్నారు.

బీటెక్‌లో ఈఈఈతో భవిష్యత్తుకు భరోసా ఉంటుందా.. తెలుసుకోండిలా..

☛ చదవండి: ఎవర్‌గ్రీన్ సివిల్ ఇంజనీరింగ్.. కెరీర్ అవకాశాలు ఇలా..

☛ చదవండి: ప్రస్తుతం జాబ్ మార్కెట్‌లో ఈ సాఫ్ట్‌వేర్ కోర్సులదే హవా..

   After Inter Jobs: ఇంటర్‌తోనే సాఫ్ట్‌వేర్‌ కొలువు

Published date : 13 Jul 2022 02:04PM

Photo Stories