Skip to main content

Experium Eco Park: ఎక్స్‌పీరియం ఎకో పార్క్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి త్వరలో కొత్త పర్యాటక విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించారు.
Experium Eco Friendly Park Inaugurated by CM Revanth Reddy, Chiranjeevi

ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో సహజ వనరులున్నా, గత ప్రభుత్వాలు పర్యాటక రంగం పట్ల సరైన దృష్టి పెట్టలేదని, దాంతో రాష్ట్రం పర్యాటకంగా వెనకబడింది అని ఆయన పేర్కొన్నారు.

రేవంత్‌రెడ్డి ఎకో టూరిజం అభివృద్ధిపై ఇటీవల తెలంగాణ అసెంబ్లీలో చర్చలు జరిగిన విషయం గుర్తు చేస్తూ, పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు తన ప్రభుత్వం కట్టుబడిందని చెప్పారు.

ప్రకృతి సంరక్షణ విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రతి ఒక్కరూ తల్లి పేరిట మొక్కలను నాటడం, వాటిని సంరక్షించడం భార్యదీక్షగా భావించాలన్నది తన సూచనగా చెప్పారు.

అలాగే.. రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం ప్రొద్దటూరులో 150 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడిన ఎకో ఫ్రెండ్లీ పార్క్ 'ఎక్స్‌పీరియం'ను సినీనటుడు చిరంజీవి, మంత్రులు జూపల్లి కృష్ణారావు, ఎంపీలు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, అనిల్‌కుమార్ యాదవ్, సీఎం రమేశ్, ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, మల్‌రెడ్డి రంగారెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి తదితరులు కలిసి జ‌న‌వ‌రి 28వ తేదీ ప్రారంభించారు.

Welfare Schemes: తెలంగాణలో నాలుగు కొత్త సంక్షేమ పథకాలు అమలు.. ఆ ప‌థ‌కాలు ఇవే..

Published date : 30 Jan 2025 08:33AM

Photo Stories