Lok Sabha Passes Jammu and Kashmir Reservation Bill
ఆరు గంటల పై చిలుకు చర్చ అనంతరం సభ వాటిని ఆమోదించింది. జమ్ము కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లు-2023పై పార్లమెంట్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రసంగిస్తూ కశ్మీర్లో 47 అసెంబ్లీ సీట్లు, జమ్ములో 43 అసెంబ్లీ సీట్లు ఏర్పాటు చేశామని తెలిపారు.
జమ్ము కశ్మీర్ అసెంబ్లీలో పీఓకేకు 24 ప్రత్యేక స్థానాలు కేటాయించినట్లు తెలిపారు. పీఓకే కూడా మన భూభాగమే కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. కశ్మీర్ పండిట్లకు ప్రత్యేకంగా 2 సీట్లను రిజర్వ్ చేసినట్లు తెలిపారు. ఈ బిల్లుతో జమ్మూకశ్మీర్లో అసెంబ్లీ స్థానాలు 90కి చేరాయి.