Skip to main content

PMGKY Scheme: మరో ఐదేళ్లు పాటు ఉచిత రేషన్‌ను పొడ‌గించిన‌ కేంద్రం

రేషన్‌ కార్డ్‌ లబ్ధిదారులకు కేంద్రం శుభవార్త చెప్పింది.
central extends free ration scheme for 5 years  Union Cabinet members discussing the extension of Pradhan Mantri Garib Kalyan Anna Yojana  scheme
central extends free ration scheme for 5 years

ప్రధాన మంత్రి గరీబ్‌ కళ్యాణ్‌ అన్న యోజన (పీఎంజీకేఏవై) పథకాన్ని పొడిగిస్తూ కేంద్ర కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ పథకం కింద 81 కోట్ల మంది రేషన్‌ కార్డ్‌ దారులకు మరో ఐదేళ్లు రేషన్‌ను ఉచితంగా అందిచనుంది. 

Uttarakhand Silkyara tunnel Operation: ఉత్తరాఖండ్‌ సిల్‌క్యారా సొరంగం ఆపరేషన్‌ విజయవంతం

ఇటీవల ఇటీవల ఛత్తీస్‌గఢ్‌ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఈ ఏడాది డిసెంబర్‌ 31తో ముగియనున్న పీఎంజీకేఏవై పథకాన్ని మరో ఐదేళ్ల పాటు పొడిగిస్తామని స్వయంగా ప్రకటించారు. ఈ క్రమంలోనే తాజాగా కేంద్ర కేబినెట్‌ దీనికి ఆమోదం తెలిపింది. కేబినెట్‌ నిర్ణయాలపై మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ వెల్లడించారు. 
కోవిడ్‌-19 మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో కేంద్రం పేదలకు అండగా నిలుస్తూ పీఎంజీకేఏవై పథకాన్ని ఏప్రిల్‌ 2020లో ప్రారంభించింది. ఈ స్కీంలో జాతీయ ఆహార భద్రతా చట్టం పరిధిలోకి వచ్చే ప్రజలకు ఉచిత రేషన్‌ను మూడు నెలల పాటు అందించింది. ఆ తర్వాత పొడిగిస్తూ వచ్చింది. ఈ డిసెంబర్‌ 31తో ఈ పథకం వ్యవధి ముగియనుండగా.. తాజాగా దీన్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 

Bihar Reservation Amendment Bill: బిహార్‌లో రిజర్వేషన్‌ సవరణ బిల్లుకు ఆమోదం

Published date : 30 Nov 2023 02:48PM

Photo Stories