Skip to main content

Piyush Goyal: నవభారతానికి స్టార్టప్‌లే వెన్నెముక.. ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దు

నవభారత నిర్మాణానికి అంకుర సంస్థలే వెన్నెముకలాంటివని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్ అన్నారు.
India's 35 lakh crore dollar economy goal by 2047  Startup Mahakumbh curtain raiser event   Startups are the backbone of new India Says Piyush Goyal   Opportunities for startups in India

2047 నాటికి 35 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీగా ఎదిగే క్రమంలో దేశం అందించే అన్ని అవకాశాలను అందిపుచ్చుకోవాలని, ఏ ఒక్కదాన్ని చేజార్చుకోవద్దని స్టార్టప్‌లకు సూచించారు. స్టార్టప్‌ మహాకుంభ్‌ కర్టెన్‌ రైజర్‌ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు తెలిపారు. దేశాభివృద్ధిలో కీలకమైన స్టార్టప్‌ విప్లవానికి వచ్చే నెల 18 నుంచి మూడు రోజులు జరిగే మహాకుంభ్‌ దర్పణంగా నిలుస్తుందని గోయల్‌ చెప్పారు.

దేశీయంగా మనకు అతి పెద్ద మార్కెట్‌ ఉంది కదా అని నింపాదిగా ఉండకూడదని, అంతర్జాతీయ మార్కెట్లలోనూ కార్యకలాపాలను విస్తరించడంపై అంకుర సంస్థలు మరింతగా దృష్టి పెట్టాలని మంత్రి చెప్పారు. ఎంట్రప్రెన్యూర్‌ షిప్, ఆవిష్కరణలపై ఆసక్తి గల విద్యార్థులు ఈ సదస్సులో పెద్ద ఎత్తున పాల్గొంటారని ఈ సందర్భంగా తెలిపారు.

Raisina Dialogue 2024: వచ్చే 10 సంవత్సరాల్లో భారత్‌ 6 నుంచి 8 శాతం వృద్ధి

Published date : 28 Feb 2024 04:09PM

Photo Stories