Skip to main content

Telangana New DGP : తెలంగాణ ఇన్‌ఛార్జ్‌ డీజీపీగా అంజ‌నీకుమార్‌.. డీజీపీగా నియ‌మించాలంటే ఉండాల్సిన అర్హ‌త‌లు ఇవే..?

తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి పదవీ కాలం డిసెంబ‌ర్‌ 31తో ముగియనుంది. దీంతో ఆస్థానంలో ఎవరు డీజీపీగా నియమితులవుతారనేది ప్రస్తుతం ఆసక్తిగా మారింది.
Anjani kumar
Anjani Kumar, DGP

అయితే తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌స్తుతానికి తెలంగాణ ఇంఛార్జ్‌ డీజీపీగా అంజ‌నీకుమార్ నియామ‌కం చేసింది. ప్రస్తుత నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, ఉమేష్ షరీఫ్, అంజనీ కుమార్, రవి గుప్తా వంటి సీనియర్ ఆఫీసర్ల పేర్లు తెరపైకి వచ్చినా.. తాత్కాలిక ప్రాతిపదికన అర్హులైన వారితో అంజ‌నీకుమార్ నియమించారు.

ఆ క్రేజ్ కోస‌మే ‘ఐపీఎస్’ అయ్యానిలా...: అంజనీ కుమార్, ఐపీఎస్

డీజీపీగా నియ‌మించాలంటే...?
వాస్తవానికి ఐపీఎస్‌గా కనీసం 30 ఏళ్లు సర్వీసు ఉన్న డైరెక్టర్ జనరల్ (డీజీ), అడిషనల్ డైరెక్టర్ జనరల్ (ఏడీజీ) హోదాలో ఉన్నవారికి డీజీపీలు (DGP)గా అవకాశం ఉంటుంది. ఈ మేరకు సీనియర్ ఐపీఎస్ అధికారుల జాబితాను రాష్ట్రప్రభుత్వం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు పంపుతుంది. అన్ని అంశాలను పరిశీలించి అందులో ముగ్గురు సీనియర్ అధికారుల పేర్లను యూపీఎస్సీ రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేస్తుంది. యూపీఎస్సీ సూచించిన ముగ్గురిలో ఒకరిని డీజీపీగా నియమించే అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. ఈ ప్రక్రియ ఏ రాష్ట్రంలోనూ అమలవుతున్న దాఖలాలు లేవు. దీనిపై సుప్రీంకోర్టులోనే అనేక వ్యాజ్యాలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో డీజీపీని ఎంపిక చేసుకునే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికే కట్టబెడుతూ 2018లో 'తెలంగాణ పోలీసు (సెలక్షన్‌ అండ్‌ అపాయింట్‌మెంట్‌ ఆఫ్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్-హెడ్‌ ఆఫ్‌ పోలీస్‌ ఫోర్స్‌) యాక్ట్‌' పేరుతో తెలంగాణ శాసనసభ ఓ బిల్లును ఆమోదించింది.

వాట్సప్‌ ‘గురు’..ఈ అభ్యర్థులకు భవిష్యత్‌లోనూ అండగా...

ఈ బిల్లు ప్ర‌కార‌మే..
ఈ బిల్లు ప్రకారమే ప్రస్తుత డీజీపీ మహేందర్‌రెడ్డి నియామకం జరిగింది. అనురాగ్ శర్మ పదవీ విరమణ తర్వాత.. మెుదట మహేందర్ రెడ్డి ఇంఛార్జ్ డీజీపీగా ఆ తర్వాత పూర్తిస్థాయి డీజీపీగా నియమితులయ్యారు. ఇప్పుడూ అదే విధానం అనుసరించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా అంజనీకుమార్‌ వైపు ప్రభుత్వం మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. అయితే ఆయన ఏపీ క్యాడర్‌కు చెందిన అధికారి. న్యాయస్థానం ఆదేశాల మేరకు తెలంగాణలో కొనసాగుతున్నారు. సీఎస్ సోమేశ్ కుమార్ కూడా ఏపీ కేడర్‌కు చెందిన వ్యక్తే. సోమేశ్‌కుమార్‌ క్యాడర్‌కు సంబంధించి హైకోర్టులో కేసు నడుస్తోంది. వచ్చే నెలలో దీనిపై తీర్పు వెలువడవచ్చని అధికారులు భావిస్తున్నారు. సోమేశ్ కుమార్ ఏపీకి వెళ్లాలని తీర్పు వస్తే ఆ ప్రభావం అంజనీ కుమార్‌పై పడనుంది. ఈ నేపథ్యంలో తాత్కాలిక డీజీపీని నియమించి ప్రభుత్వం...ఈ మేరకు ఉత్తర్వులను విడుద‌ల చేసింది.

Mahesh Bhagwat, IPS : గైడెన్స్‌ లేకనే ఫెయిల్‌ అయ్యా..అందుకే ఇలా చేస్తున్నా..

Published date : 29 Dec 2022 04:44PM

Photo Stories