Skip to main content

Law college: Law కళాశాల మంజూరు ఎక్కడంటే..

Law college
Law college

కందుకూరు: బీసీ గురుకుల లా కళాశాలను ప్రభు త్వం కందుకూరుకు మంజూరు చేసింది. మహాత్మాగాంధీ బీసీ డిగ్రీ గురుకులాల్లో సంప్రదాయ డిగ్రీ కోర్సులకు బదులు ఈ ఏడాది నుంచే బీఏ–ఎల్‌ఎల్‌బీ, బీబీఏ ఎల్‌ఎల్‌బీ లా కోర్సులను ప్రవేశపెడుతున్నట్లు శుక్రవారం వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ జీఓ జారీ చేసింది. ఈ ఏడాది నుంచే లా తరగతులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు.

కందుకూరుకు లా కళాశాల మంజూరు చేసినందుకు సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఇప్పటికే మహేశ్వరం నియోజకవర్గం పరిధిలో గురుకుల పాఠశాలలు, డిగ్రీ కళాశాల, పాలిటెక్నిక్‌ కళాశాలలు ఏర్పాటయ్యాయన్నా రు. కందుకూరుకు మెడికల్‌ కళాశాల సైతం మంజూరైందన్నారు. త్వరలో నిర్మాణ పనులకు శంకు స్థాపన చేయనున్నట్టు చెప్పారు. భవిష్యత్‌లో ఇంజనీరింగ్‌ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. బడుగులకు చెందిన విద్యార్థులు ఉన్నత చదువులు చదివేలా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.

Published date : 11 Sep 2023 10:00AM

Photo Stories