Skip to main content

JNTUA Mistake: జేఎన్‌టీయూ పరీక్షల విభాగం పొరపాటు – 193 మంది విద్యార్థుల జవాబు పత్రాల గల్లంతు!

జేఎన్‌టీయూ అనంతపురం బీటెక్ పరీక్షల విభాగంలో జరిగిన పొరపాటుతో 193 మంది విద్యార్థుల జవాబు పత్రాలు తప్పిపోయాయి. విద్యార్థుల భవిష్యత్తుపై అస్పష్టత నెలకొనగా, అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. నష్టనివారణ చర్యలు చేపట్టినప్పటికీ, ఈ ఘటనపై విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
JNTUA Mistake 193 students answer sheets missing   JNTU Anantapur exam section negligence controversy

అనంతపురం: జేఎన్‌టీయూ అనంతపురం పరీక్షల విభాగంలో జరిగిన పొరపాటు వాస్తవమేనని అధికారులు లిఖితపూర్వకంగా అంగీకరించారు. జవాబు పత్రాలు గల్లంతైన ఘటన పై బుధవారం ‘సాక్షి’ పత్రికలో ‘జవాబు పత్రాలకు రెక్కలు’ శీర్షికతో కథనం ప్రచురితమైంది. ఈ క్రమంలో జేఎన్‌టీయూ లో కలకలం రేగింది.

అయితే, పరీక్షల విభాగం నష్టాన్ని పరి‌హరించడానికి అన్ని చర్యలు తీసుకుంటామని పేర్కొంది. ఈ క్రమంలో ఎవాల్యుయేషన్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ నాగప్రసాద్ నాయుడు లిఖితపూర్వక వివరణ ఇచ్చారు. ఆయన ప్రకారం, బీటెక్ మొదటి, రెండో సంవత్సరం విద్యార్థుల జవాబు పత్రాలు పొరపాటున మిళితం అయ్యాయి. ఈ గుర్తింపులో కొంత ఆలస్యమైందని, పొరపాటు జరిగిందంటూనే, కట్టుదిట్టంగా, పకడ్బందీగా ప్రక్రియను కొనసాగిస్తున్నట్లు తెలిపారు.

Btech EEE Branch Advantages : ఇంజ‌నీరింగ్‌లో 'EEE' బ్రాంచ్ తీసుకోవ‌డం ద్వారా.. లాభాలు ఇవే..!

దీంతో పాటు, మూల్యాంకనం, జవాబు పత్రాల భద్రత విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరుకుంటున్నారు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 31 Jan 2025 09:24AM

Photo Stories