ఈ నేపథ్యంలో తగ్గించిన పర్సంటైల్కు అనుగుణంగా అర్హులైన అభ్యర్థులు పీజీ మెడికల్, డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోవడానికి డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం బుధవారం రాత్రి నోటిఫికేషన్ జారీ చేసింది. https://pgcq.ysruhs.com వెబ్సైట్లో సెప్టెంబర్ 23 రాత్రి తొమ్మిది గంటలలోగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. నిబంధనలపై సందేహాల నివృత్తికి 89787 80501, 7997710168, 93918 05238, 9391805239 నంబర్లలో సంప్రదించాలని రిజిస్ట్రార్ డాక్టర్ రాధికారెడ్డి సూచించారు.