కంచరపాలెం: స్థానిక జిల్లా ఉపాధి కార్యాలయం నేషనల్ కెరియర్ సర్వీస్ సెంటర్లో ఈనెల 27న జాబ్మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఎంప్లాయ్మెంట్ అధికారి సిహెచ్.సుబ్బిరెడ్డి(క్లరికల్) తెలిపారు.
పోర్ట్ సర్వేయర్స్, అసోసియేట్స్, సేల్స్ ఎగ్జిక్యూటివ్స్, జూనియర్ నర్స్, కెమిస్ట్, ట్రైనీ కెమిస్ట్, జూనియర్ ఆఫీసర్, సేల్స్ ఎగ్జిక్యూటివ్, ఫార్మాసిస్ట్ తదితర ఉద్యోగాలకు టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిప్లమో, ఏదైనా డిగ్రీ, పీజీ పూర్తిచేసిన 18–45 ఏళ్ల మధ్య వయస్సు గల అభ్యర్థులు అర్హులన్నారు. ఆయా ఉద్యోగాలను బట్టి జీతం నెలకు రూ.13,000 నుంచి రూ.27,000ల వరకు ఉంటుందన్నారు.