ఆర్టీసీలో అప్రెంటిస్షిప్ చేయడానికి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ఆర్టీసీ జోనల్ సిబ్బంది శిక్షణ కళాశాల ప్రిన్సిపాల్ కె.శ్రీలక్ష్మి ఆగస్టు 2న తెలిపారు.
అప్రెంటిస్షిప్కు దరఖాస్తుల ఆహ్వానం
దీనికి ఐటీఐ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. అర్హులైన, ఆసక్తి కలిగిన ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అభ్యర్థులు తమ దరఖాస్తులను ఆగస్టు 10లోపు ఏపీ అప్రెంటిస్షిప్ ఇండియా వెబ్సైట్లో ఆన్లైన్లో సమర్పించాలని సూచించారు. అభ్యర్థులకు ఐటీఐలో వచ్చిన మార్కులు, సీనియారిటీ ప్రాతిపదికన ఎంపిక జరుగుతుందని పేర్కొన్నారు.