బీసీ విద్యార్థులకు గురుకుల డిగ్రీ విద్య కలగానే మిగులుతోంది. జనాభాపరం గా అత్యధికంగా ఉన్నా.. ప్రస్తుతం ఒక్కటంటే ఒక్క టే గురుకుల మహిళా డిగ్రీ కాలేజీ ఉంది.
బీసీలకు గురుకుల డిగ్రీ ఏదీ?
ప్రతి జిల్లా కేంద్రంలో బీసీ గురుకుల డిగ్రీ కాలేజీ ఏర్పాటుకు సొసైటీ ప్రతిపాదనలు పంపి ఏళ్లు గడుస్తున్నా ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. నాగార్జునసాగర్ ఉప ఎన్నికప్పుడు అక్కడ బీసీ గురుకుల బాలుర డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తామని కేసీఆర్ చెప్పి ఏడాదైనా ఆ హామీ నెరవేరలేదు. సొసైటీ ప్రతిపాదనలు ఆమోదించి తమకు ఉచితంగా గురుకుల డిగ్రీ విద్య అందించాలని విద్యార్థులు కోరుతున్నారు.