Skip to main content

Collector MS Diwakar: ద్వితీయ పీయూ సప్లిమెంటరీ ప‌రీక్ష‌ల తేదీలు ఇవే..

హొసపేటె: జిల్లాలో ఆగ‌స్టు 21 నుంచి ప్రారంభం కానున్న ద్వితీయ పీయూసీ ప్రత్యేక సప్లిమెంటరీ పరీక్షలను సజావుగా నిర్వహణకు అన్ని చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ ఎంఎస్‌ దివాకర్‌ సూచించారు.
Collector MS Diwakar
మాట్లాడుతున్న జిల్లాధికారి ఎంఎస్‌ దివాకర్‌

ద్వితీయ పీయూసీలో ఫెయిలైన విద్యార్థులకు 2వ ప్రత్యేక సప్లిమెంటరీ పరీక్షకు సంబంధించి ఆగ‌స్టు 16న‌  సాయంత్రం నిర్వహించిన ప్రిలిమినరీ ప్రిపరేషన్‌పై వీడియో కాన్ఫరెన్స్‌కు ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు. 5 పరీక్షా కేంద్రాల్లో 4184 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తారని తెలిపారు.

ఈ సారి పరీక్ష మధ్యాహ్నం జరుగుతుందని, పరీక్ష అనంతరం సమాధాన పత్రాలు పోస్టాఫీసుకు పంపే వరకు అన్ని తాలూకా పోస్టాఫీసుల్లో సిబ్బందిని నియమించాలన్నారు. నిర్దేశిత సమయంలో పరీక్ష కేంద్రాలకు ప్రశ్నపత్రాల సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.

చదవండి: Schools: బడికి డుమ్మా..కుదరదమ్మా..

పరీక్షల మార్గదర్శకాలను కచ్చితంగా పాటించడంతో పాటు, ప్రశ్న పత్రాలను తీసుకువెళ్లే వాహనాల జీపీఎస్‌ సిస్టమ్‌ను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలన్నారు. ఈ విషయంలో అధికారులందరూ మరింత దృష్టి సారించాలని ఆయన ఆదేశించారు. సన్నాహాలపై అండర్‌ గ్రాడ్యుయేట్‌ ఎడ్యుకేషన్‌ డిపార్ట్‌మెంట్‌ డిప్యూటీ డైరెక్టర్‌, వివిధ శాఖల తాలూకా స్థాయి అధికారులు, కళాశాలల ప్రిన్సిపాల్స్‌ మార్గదర్శకాల గురించి మాట్లాడారు.

పరీక్ష ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు తగిన నిఘా ఉంచి పారదర్శకంగా పరీక్షల నిర్వహణకు సహకరించాలని సూచించారు.

చదవండి: Artificial Intelligence: బడికొస్తున్న ‘మేధావి’!

Published date : 18 Aug 2023 03:34PM

Photo Stories