అగ్రి డిప్లొమా కోర్సులకు స్పాట్ కౌన్సెలింగ్ తేదీ ఇదే..
Sakshi Education
తెలంగాణ రాష్ట్రం ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని డిప్లొమా కోర్సుల కోసం సెప్టెంబర్ 23న స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహి స్తున్నట్లు వర్సిటీ రిజిస్ట్రార్ సుధీర్ కుమార్ తెలిపారు.
అగ్రి డిప్లొమా కోర్సులకు స్పాట్ కౌన్సెలింగ్ తేదీ ఇదే..
మొదటి, రెండవ విడత కౌన్సెలింగ్లో మిగిలిన సీట్ల ఖాళీల భర్తీకై ఈ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. విశ్వవిద్యాలయం ఆడి టోరియంలో జరిగే ఈ కౌన్సెలింగ్కు ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఒరిజినల్ సర్టి ఫికెట్స్, నిర్ణీత ఫీజుతో కౌన్సెలింగ్కు హాజరు కావాలని రిజిస్ట్రార్ సూచించారు. సీట్ల ఖాళీల వివరాలు, ఫీజులు, ఇతర సమగ్ర సమాచారం కోసం వర్సిటీ వెబ్సైట్ను చూడాలన్నారు.