Skip to main content

Good News: నర్సింగ్‌ విద్యార్థులకు శుభవార్త

నర్సింగ్‌ విద్యార్థులకు శుభవార్త. రాష్ట్ర ప్రభుత్వం వారి ఇంట దీపావళి వెలుగులు నింపింది.
Good News
నర్సింగ్‌ విద్యార్థులకు శుభవార్త

ఆ విద్యార్థుల స్టైపెండ్ ను మూడింతలకుపైగా పెంచింది. ఈ మేరకు తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ నవంబర్ 3న ఉత్తర్వులు జారీచేశారు. సై్టపెండ్‌ పెంపుదల వెంటనే అమలులోకి వస్తుందని పేర్కొన్నారు. ఈ పెంపుదల నర్సింగ్‌ స్కూళ్లు, నిమ్స్‌ల్లో చదువుతున్న జీఎన్ఎం, బీఎస్సీ (నర్సింగ్‌) విద్యార్థులకు వర్తిస్తుంది. ఎంఎస్సీ (నర్సింగ్‌) విద్యార్థులకు కూడా సై్టపెండ్‌ విధానాన్ని తొలిసారిగా ప్రవేశపెట్టినట్లు వైద్య విద్యా సంచాలకుడు (డీఎంఈ) డాక్టర్‌ రమేశ్‌రెడ్డి పేర్కొన్నారు. ఎంఎస్సీ(నర్సింగ్‌) మొదటి ఏడాది విద్యార్థులకు నెలకు రూ.9 వేలు, రెండో ఏడాది విద్యార్థులకు రూ.10 వేల సై్టపెండ్‌ అందజేస్తారు.
జీఎన్ఎం మూడేళ్లు, బీఎస్సీ నర్సింగ్‌ నాలుగేళ్ల కోర్సుల్లో ప్రస్తుతం తీసుకుంటున్న స్టైపెండ్, పెరిగిన స్టైఫండ్‌ వివరాలు (నెలకు రూపాయల్లో)

సంవత్సరం

ప్రస్తుతం

పెరిగాక..

మొదటి ఏడాది

1,500

5,000

రెండో ఏడాది

1,700

6,000

మూడో ఏడాది

1,900

7,000

నాలుగో ఏడాది (బీఎస్సీ నర్సింగ్‌లకు..)

2,200

8.000

చదవండి:

EWS: ఈడబ్ల్యూఎస్‌ కోటా.. ఎంబీబీఎస్‌కు కేటాయించిన సీట్లు సంఖ్య!

EAMCET: కౌన్సెలింగ్‌లో వీటిని పరిశీలించాలి

NEET: డాక్టరమ్మ...

EAMCET: అంత కష్టమేం కాదు: మాజీ చైర్మన్

Published date : 05 Nov 2021 03:56PM

Photo Stories