రాష్ట్ర విద్యార్థులకు ఉద్యోగంతో కూడిన ఎంఎస్ కోర్సులను అందించేలా జర్మనీ దేశానికి చెందిన ఎస్జీఐటీ స్టీన్బీస్ వర్సిటీతో ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి సెప్టెంబర్ 26న ఒప్పందం చేసుకుంది.
ఉద్యోగంతో కూడిన ఎంఎస్ కోర్సులు
ఉన్నత విద్యామండలి కార్యాలయంలో చైర్మన్ ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి సమక్షంలో కార్యదర్శి నజీర్ అహమ్మద్, ఎస్జీఐటీ స్టీన్బీస్ వర్సిటీ డైరెక్టర్ బెట్రమ్ లోహ్మూర్ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందంతో రాష్ట్ర విద్యార్థులకు ఉన్నత ఉద్యోగావకాశాలు మెరుగుపడతాయని హేమచంద్రారెడ్డి తెలిపారు. బెట్రమ్ లోహ్మూర్ మాట్లాడుతూ రానున్న నాలుగేళ్లలో బాష్ వంటి కంపెనీలకు 5 లక్షల మంది అభ్యర్థులు అవసరం అవుతారని చెప్పారు.