Kendriya Vidyalaya: 1వ తరగతి ప్రవేశాల గడువు పెంపు.. చివరి తేదీ ఇదే..
Sakshi Education
కేంద్రీయ విద్యాలయ సంగతన్ 2022-23 విద్యా సంవత్సరానికి 1వ తరగతిలో ప్రవేశాలకు నోటిఫికేషన్ గడువుని పొడిగించింది.
Kendriya Vidyalaya: 1వ తరగతి ప్రవేశాల గడువు పెంపు..
ముందు జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం దరఖాస్తులు చేసుకోవడానికి చివరి తేదీగా మార్చి 21 ని నిర్ణయించింది. తాజాగా అప్లికేషన్లు సమర్పించడానికి తుది గడువును ఏప్రిల్ 11 వరకు అవకాశం కలిపించారు. విద్యార్ధుల తల్లిదండ్రులు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని కేంద్రీయ విద్యాలయ తెలిపింది.
తాజా ముఖ్యమైన తేదీలు ఇవే..
ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభ తేదీ: ఫిబ్రవరి 28, 2022
ఆన్లైన్ రిజిస్ట్రేషన్లకు చివరి తేదీ: ఏప్రిల్ 11, 2022
సీటు అలాట్ మెంట్ తేదీ: ఏప్రిల్ 18, 2022
సీటు అలాట్ మెంట్ సెకండ్ రౌండ్ తేదీ: ఏప్రిల్ 25, 2022
సీటు అలాట్ మెంట్ థార్డ్ రౌండ్ తేదీ: మే 5, 2022