Skip to main content

Teacher Training: వచ్చే నెలలో టీచర్లకు ట్రైనింగ్‌.. టీచర్ల ఎంపిక ఇలా!

హనుమకొండ: రాష్ట్రంలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్‌, మోడల్‌, రెసిడెన్షియల్‌ పాఠశాలల ఉపాధ్యాయులకు వేసవి సెలవుల్లో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. ఈ శిక్షణకు ముందుగా మండల మరియు జిల్లాస్థాయిలో రిసోర్స్ పర్సన్‌ల ఎంపిక చేపట్టనున్నారు.
teacher training summer 2025 resource person selection

రిసోర్స్ పర్సన్‌ల ఎంపిక కోసం దరఖాస్తుల ఆహ్వానం

 వారం పాటు, ఏప్రిల్ 22 నుండి 24వ తేదీ వరకు ఆసక్తి ఉన్న ఎస్‌జీటీ, స్కూల్ అసిస్టెంట్లు, హెచ్‌ఎంల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. ఎంపిక ప్రక్రియకు సంబంధించి జిల్లా విద్యా అధికారులు (డీఈఓలు) పర్యవేక్షణ చేస్తారు.

ఎంపిక ప్రక్రియలో సబ్జెక్టుల వారీగా ఎంపిక

  • ప్రాథమిక పాఠశాలల స్థాయి: తెలుగు, ఇంగ్లిష్, గణితం, ఈవీఎస్‌ నుండి మండల స్థాయికి ఇద్దరు చొప్పున ఎంపిక
  • జిల్లా స్థాయి ఎంపిక (DRP): ఒక్కో సబ్జెక్టుకు ఇద్దరు
  • హైస్కూల్ ఉపాధ్యాయుల ఎంపిక: 9 సబ్జెక్టులకు నాలుగురి చొప్పున మొత్తం 36 మంది
  • ఉర్దూ మీడియం & స్పెషల్ ఎడ్యుకేషన్: ప్రత్యేక ఎంపికలు

చదవండి: Civils Topper Sai Shivani: నెలలో డబుల్ బొనాంజా - గ్రూప్ 1, సివిల్స్‌లో సత్తా చాటిన సాయి శివాని!

ఇంటర్వ్యూలు, డెమోలు కలెక్టర్ ఆధ్వర్యంలో

దరఖాస్తుల పరిశీలన అనంతరం కలెక్టర్‌ ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు నిర్వహించి, డెమో ప్రెజెంటేషన్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారి జాబితాను ఏప్రిల్ 28లోపు రాష్ట్ర విద్యాపరిశోధన శిక్షణ మండలి (SCERT)కి పంపించనున్నారు.

ఎంపికైన వారికి ప్రత్యేక శిక్షణ

ఎంపికైన రిసోర్స్ పర్సన్‌లకు ఆయా సబ్జెక్టులపై ఎక్స్‌పర్ట్స్‌ ద్వారా ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. వీరి ద్వారా మిగిలిన ఉపాధ్యాయులకు శిక్షణలు నిర్వహిస్తారు. ఇది గుణాత్మక విద్యను మరింత బలోపేతం చేయడానికి తీసుకుంటున్న కీలక నిర్ణయం.

Join our WhatsApp Channel: Click Here
 Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
Published date : 23 Apr 2025 04:58PM

Photo Stories