Admissions in Open School: ఓపెన్ స్కూల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
![Admissions in Open School](/sites/default/files/images/2023/08/08/aposs-1691490892.jpg)
మహారాణిపేట: ఓపెన్ స్కూల్ ద్వారా టెన్త్, ఇంటర్మీడియెట్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లికార్జున తెలిపారు. సోమవారం కలెక్టరేట్ ఆవరణలో దూర విద్యా విధానం పోస్టర్ను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆగస్టు 31వ తేదీ నాటికి 14 సంవత్సరాల వయస్సు నిండిన వారందరూ పదో తరగతిలో ప్రవేశానికి అర్హులన్నారు. ఏపీ ఓపెన్ స్కూలు ద్వారా ఎస్ఎస్సీలో ఉత్తీర్ణులైన వారితోపాటు పాఠశాలల్లో ఎస్ఎస్సీ పూర్తి చేసి వివిధ కారణాల వల్ల ఇంటర్మీడియెట్ చదవలేక పోయినవారికి, ఇంటర్ ఫెయిలై చదువు మానేసిన వారికి సార్వత్రిక విద్యావిధానంలో ఇంటర్మీడియెట్ కోర్సును ప్రభుత్వం అందిస్తోందన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కె.ఎస్.విశ్వనాథన్, డీఆర్వో శ్రీనివాసమూర్తి, ఆర్డీవో హుస్సేన్ సాహెబ్, డీఈవో చంద్రకళ, ఆర్ఐవో సత్యనారాయణ పాల్గొన్నారు.