Skip to main content

Kota: ఆగ‌ని విద్యార్థుల ఆత్మ‌హ‌త్య‌లు... రెండు రోజుల్లో ఇద్ద‌రు బలి... ఇప్ప‌టివ‌ర‌కు 18 మంది సూసైడ్‌.. కోటాలో ఏం జ‌రుగుతోంది.?

కోచింగ్ హ‌బ్‌గా పేరొందిన రాజస్థాన్‌లోని కోటాలో విద్యార్థుల ఆత్మ‌హ‌త్య‌లు ఆగ‌డం లేదు. రెండు రోజుల్లో ఇద్ద‌రు విద్యార్థులు ఒత్తిడిని భ‌రించ‌లేక బ‌ల‌వంతంగా త‌నువు చాలించారు. ఉత్త‌ర భార‌త‌దేశం నుంచే కాక‌.. దేశంలోని న‌లుమూల‌ల నుంచి కోటాకు పెద్ద ఎత్తున విద్యార్థులు వ‌స్తుంటారు.
India's coaching hub Kota
ఆగ‌ని విద్యార్థుల ఆత్మ‌హ‌త్య‌లు... రెండు రోజుల్లో ఇద్ద‌రు బలి... ఇప్ప‌టివ‌ర‌కు 18 మంది సూసైడ్‌.. కోటాలో ఏం జ‌రుగుతోంది.?

సాక్షి, ఎడ్యుకేష‌న్‌: నీట్‌, జేఈఈ, సివిల్స్‌... ఇలా పోటీ ప‌రీక్ష ఏదైనా కోచింగ్ సెంట‌ర్ల‌కు కోటా ప్ర‌సిద్ధి. ప్ర‌తీ ఏడాది ఇక్క‌డ సుమారు 3 ల‌క్ష‌ల మంది విద్యార్థులు కోచింగ్ కోసం వ‌స్తుంటారు. అయితే పోటీ ప‌రీక్ష‌ల్లో స‌త్తాచాటేందుకు, ర్యాంకులు రాబ‌ట్టేందుకు కోచింగ్ సెంట‌ర్ల నిర్వాహ‌కులు విద్యార్థుల‌ను విప‌రీతంగా చ‌దివిస్తూ ఉంటారు. 

ఇవీ చ‌ద‌వండి: నేడో, రేపో పీఆర్‌సీ ప్ర‌క‌ట‌న‌... తెలంగాణ ఉద్యోగుల‌కు కేసీఆర్ వ‌రాలు..!

kota

ఈ ఒత్తిడిని త‌ట్టుకోలేని విద్యార్థులు ప్రాణం తీసుకుంటున్నారు. గ‌త ఎనిమిది నెల‌ల్లో 18 మంది విద్యార్థులు ఆత్మ‌హ‌త్య చేసుకున్నారంటే ప‌రిస్థితి ఎంత ఆందోళ‌న‌క‌రంగా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. గురువారం(ఆగ‌స్ట్ 3న) ఒక విద్యార్థి ఆత్మ‌హ‌త్య చేసుకున్న ఘ‌ట‌న మ‌ర‌వ‌క‌ముందే ఈ రోజు మ‌రో నీట్ విద్యార్థి సూసైడ్ చేసుకున్నాడు. 

ఇవీ చ‌ద‌వండి: నిర్మాణ‌రంగంలో భారీగా ఉద్యోగాలు... 2030నాటికి 10 కోట్ల ఉద్యోగాలు

వివిధ ఎంట్రెన్స్‌ టెస్టులు, పోటీపరీక్షల కోచింగ్‌ సెంటర్లకు ప్రసిద్ధి చెందిన ‘కోటా’లో.. పొరుగు రాష్ట్రాల నుంచి ఏటా ల‌క్ష‌ల‌ మంది విద్యార్థులు శిక్షణ పొందుతారు. ఈ ఏడాది దాదాపు 3 లక్షల మంది అక్కడ శిక్షణ తీసుకుంటున్నట్లు అంచనా. ఈ క్రమంలోనే అక్కడ విద్యార్థులు ఆత్మహత్యలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. 

kota

ఇవీ చ‌ద‌వండి: ఆగస్టు 17వ వరకు పోలీసు ప‌రీక్ష ఫ‌లితాలు లేన‌ట్లే... కారణం ఏంటంటే...

గతేడాది 15 మంది విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడగా.. ఈ ఏడాది ఇప్పటికే ఆ సంఖ్య 18కి చేరడం క‌ల‌వ‌ర‌పెడుతోంది. అంతకుముందు కూడా పదుల సంఖ్యలో ఆత్మహత్యలు చోటుచేసుకున్నాయి. వీటితోపాటు అనేక ఘటనల్లో విద్యార్థులు ఆత్మహత్యకు యత్నించిన సందర్భాలూ ఉన్నాయి. అయితే, ఒత్తిడితోనే ఇలా బలవన్మరణానికి పాల్పడుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.

Published date : 05 Aug 2023 11:45AM

Photo Stories