ఆంగ్ల భాషను అందరికీ చేరువ చేసేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న చర్యలు అభినందనీయమని U.S. Consul General (Hyderabad) జెన్నిఫర్ లార్సన్ అన్నారు.
ఆంగ్లంపై ఏపీ చర్యలు భేష్
అక్టోబర్ 31న ఏయూను సందర్శించిన ఆమె అధికారులతో సమావేశమయ్యారు. సీఎం వైఎస్ జగన్మో హన్రెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపుతూ గ్రామీణ ప్రాంతాలకు సైతం ఆంగ్ల భాషను చేరువ చేసేందుకు కృషి చేస్తున్నారన్నారు.
విద్యార్థులకు ప్రభుత్వం స్కాలర్షిప్లు వంటివి అందిస్తోందా అని ఏయూ వీసీ పీవీజీడీ ప్రసాదరె డ్డిని అడిగారు. ప్రభుత్వం అధిక శాతం విద్యార్థులకు కళాశాల రుసుములను, హాస్టల్ చార్జీలను జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాల ద్వారా చెల్లిస్తోందని వివరించారు.