ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఆంగ్ల భాష ఉచ్ఛారణపై తర్ఫీదు ఇచ్చేందుకు రాష్ట్రస్థాయి శిక్షణ కార్యక్రమం మార్చి 15న ప్రారంభమైంది.
ఆంగ్ల భాష ఉచ్ఛారణపై శిక్షణ ప్రారంభం
విద్యా సంస్కరణల్లో భాగంగా ‘ఆంగ్ల భాష ఉచ్ఛారణ–శబ్దాలు’ అనే అంశంపై రాష్ట్ర విద్యాపరిశోధన శిక్షణ మండలి, సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఎస్సీఈఆర్టీ డైరక్టర్ డాక్టర్ బి.ప్రతాప్రెడ్డి ప్రారంభించారు. మార్చి 19వ శిక్షణ కొనసాగుతుంది. ఇందులో ఎంపికై శిక్షణ పొందే ఉపాధ్యాయులు శిక్షణ అనంతరం వారి సొంత జిల్లాల్లోని ఇతర ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వనున్నారు. వీరికి ఇంగ్లిష్ అండ్ ఫారె¯ŒS లాంగ్వేజెస్ వర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్లు ప్రొ.జయరాజు, వికాస్ శిక్షణ ఇచ్చారు.