CBSE: ఈ పరీక్షల్లో కాలిక్యులేటర్కు అనుమతి

ఆన్స్క్రీన్ మార్కింగ్ (OMS) ద్వారా డిజిటల్ మూల్యాంకనం
సీబీఎస్ఈ ఇకనుంచి ఆన్స్క్రీన్ మార్కింగ్ (OMS) విధానాన్ని అమలు చేయనుంది. ప్రశ్నపత్రాలను స్కాన్ చేసి, ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా మూల్యాంకనం చేస్తారు. దీని వల్ల ఫలితాలు త్వరగా వెల్లడించడంతో పాటు మూల్యాంకనలోని తప్పులను సాఫ్ట్వేర్ గుర్తించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రముఖ సబ్జెక్టులైన సైన్స్, మాథ్స్ సప్లిమెంటరీ పరీక్షలకు ఇది పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించనున్నారు.
సబ్జెక్టుల్లో నైపుణ్య అభివృద్ధి – పారిశ్రామిక భాగస్వామ్యంతో
సీబీఎస్ఈ 2026-27 విద్యా సంవత్సరం నుంచి నైపుణ్యాభివృద్ధిని సబ్జెక్టులతో మేళవించే విధానాన్ని తీసుకురానుంది. పారిశ్రామిక భాగస్వామ్యంతో విద్యార్థులు చదివే సమయంలోనే నైపుణ్యాలను అభివృద్ధి చేసుకునేలా ఏర్పాట్లు చేయనుంది. టెన్త్ తరగతి నుంచే ఈ విధానాన్ని ప్రవేశపెట్టనుంది.
చదవండి: 1161 Jobs: పదోతరగతి అర్హతతో సీఐఎస్ఎఫ్లో కానిస్టేబుల్ కొలువులు.. ఎంపిక విధానం ఇలా!
సైన్స్, సోషల్ సబ్జెక్టులకు కొత్త మూల్యాంకన విధానం
పాఠశాల స్థాయిలో సైన్స్, సోషల్ సబ్జెక్టుల మూల్యాంకన విధానాన్ని పునఃపరిశీలించి, గమనించే తీరులో మార్పులు తేవాలని నిర్ణయించింది. పాఠం పూర్తయ్యే రోజే పరీక్షలు నిర్వహించి, లోతైన ప్రశ్నలతో రీజనింగ్ అంశాలను పరిగణనలోకి తీసుకురానుంది.
ముఖ్యమైన తేదీలు
కాలిక్యులేటర్ అనుమతి: 2025-26 విద్యా సంవత్సరం నుంచి
నైపుణ్య అభివృద్ధి విధానం: 2026-27 విద్యా సంవత్సరం నుంచి
![]() ![]() |
![]() ![]() |
Tags
- CBSE 12th class calculator permission 2025
- CBSE plus two exam calculator allowed
- Basic calculator usage in CBSE exams 2025
- CBSE board exam changes 2025-26
- On-screen marking system in CBSE exams
- Digital evaluation process in CBSE 2025
- CBSE new syllabus updates 2025-26
- Skill-based learning in CBSE subjects
- CBSE exam pattern changes 2026
- CBSE board meeting decisions 2025