రాష్ట్రంలో ఇప్పటి వరకు ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లోని సీట్లను మాత్రమే ప్రభుత్వం కనీ్వనర్ కోటాలో భర్తీ చేస్తున్న విషయం తెలిసిందే.
పేద విద్యార్థుల కల సాకారం
2021 విద్యా సంవత్సరం నుంచి ప్రైవేటు వర్సిటీల్లోని 35 శాతం సీట్లను రాష్ట్రంలోని మెరిట్ విద్యార్థులకు రిజర్వేషన్ల ప్రకారం అందించాలని ప్రభుత్వం సంకలి్పంచింది. ఆ మేరకు ఆయా వర్సిటీల్లోని 35 శాతం సీట్లను కనీ్వనర్ కోటాలోకి తీసుకు వచి్చంది. తద్వారా ప్రైవేట్ యూనివర్సిటీల్లో చదవాలనే మెరిట్ ఉన్న పేద విద్యార్థుల కల సాకారం కానుంది. ప్రభుత్వ నిర్ణయం కారణంగా 2,330 బీటెక్ సీట్లు, 105 ఏజీ బీఎస్సీ సీట్లు కనీ్వనర్ కోటా ద్వారా అదనంగా అందుబాటులోకి రానున్నాయి.