దేశవ్యాప్తంగా ఐఐటీ, ఎన్ ఐటీ, ట్రిపుల్ ఐటీ ఇతర కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే సంస్థల్లో జేఈఈ ర్యాంకుల ఆధారంగా భర్తీ చేసే జాయింట్ సీట్ అలోకేషన్ అథారిటీ(జోసా) ఖాళీలకు సంబంధించిన రిజి్రస్టేషన్ గడువు అక్టోబర్ 25తో ముగుస్తుంది.
జోసా ఆఖరు తేదీ ఇదే..
అక్టోబర్ 27న తొలి రౌండ్ సీట్ల కేటాయింపు జరుగుతుంది. సీట్లు దక్కిన విద్యార్థులు అక్టోబర్ 30వ తేదీలోగా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. రెండో దశ సీట్ల కేటాయింపు నవంబర్ 1, మూడో దశ నవంబర్ 6వ తేదీన ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ కోటాతో కలుపుకుని మొత్తం 52,453 సీట్లు ఉంటే... ఇందులో ఐఐటీ సీట్లు 16,232, ఎన్ ఐటీ సీట్లు 23,997, ట్రిపుల్ ఐటీ సీట్లు 6,146, జీఎఫ్టీఐ సీట్లు 6,078 ఉన్నాయి.