Skip to main content

కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు ఆర్థిక భరోసా

లక్ష్మి అనే మహిళ ఓ ప్రభుత్వ శాఖలో ఐదేళ్లుగా కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగం చేస్తోంది. తొలి మూడేళ్లలో నిత్యం భయం భయంగా పని చేయాల్సి వచ్చేది. అనారోగ్యంగా ఉన్నప్పటికీ సెలవులు ఇచ్చే వారు కాదు. టైమ్‌ స్కేల్‌ ఇవ్వాలని అడుగుతున్న వారిలో నీ పేరూ ఉందని, ఇలాగైతే ఉద్యోగం పోగొట్టుకుంటావని హెచ్చరించారు.
కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు ఆర్థిక భరోసా
కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు ఆర్థిక భరోసా

సరిపోని జీతంతో, సమస్యల నడుమ ఉద్యోగ జీవితాన్ని నెట్టుకొచ్చింది. ఇక ఈ జీవితం ఇంతేనా అని ఓ దశలో నిరాశతో కుంగిపోయింది. వైఎస్‌ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పరిస్థితి మారుతుందని పలువురు అంటుంటే.. ఆ రోజు త్వరగా రావాలని తనూ కలలు కనింది. ఇప్పుడు ఆ కల నిజం అయిందని ఆనందంతో చెబుతోంది. జగన్ ప్రభుత్వ చర్యల వల్ల తనకు ఏకంగా రూ.13 వేల వరకు జీతం పెరిగిందని సంబరపడుతోంది. ఇలా లక్ష్మి ఒక్కరే కాదు.. వేలాది మంది కాంట్రాక్టు ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో వేతనాలు పెంచాలని, మినిమమ్‌ టైమ్‌ స్కేలు ఇవ్వాలని గత ప్రభుత్వ హయాంలో పలుమార్లు కాంట్రాక్టు ఉద్యోగులు ప్రభుత్వానికి విన్నవించుకున్నా ఫలితం లేకపోయింది. ఆందోళన బాట పట్టిన వారిని ఉద్యోగాల నుంచి తొలగించారు. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌కు సరిగ్గా 20 రోజుల ముందు 2019 జనవరి 28న జీఓ 12, ఫిబ్రవరి 18న జీఓ 24 ఇచ్చారు కానీ అమలు చేయకుండా మోసం చేశారు. కేవలం ఓట్లు దండుకోవాలనేదే అప్పటి సీఎం చంద్రబాబు ఎత్తుగడ. అప్పట్లో ప్రతిపక్ష నేతగా వైఎస్‌ జగన్ తన సుదీర్ఘ పాదయాత్రలో కాంట్రాక్టు ఉద్యోగుల వెతలను కళ్లారా చూసి.. ఈ పరిస్థితి మారుస్తానని హామీ ఇచ్చారు. ఆ మేరకు  అధికారంలోకి రాగానే  దాదాపు అన్ని విభాగాల్లోని కాంట్రాక్టు ఉద్యోగుల కు ఎంటీఎస్‌ (మినిమం టైమ్‌ స్కేలు) వర్తించేలా జీఓ 40ని అమల్లోకి తెచ్చారు. ప్రభుత్వ ఉద్యోగిను లతో సమానంగా కాంట్రాక్టు ఉద్యోగినులకు కూడా మెటర్నిటీ లీవు, ఇతర సదుపాయాలు కల్పించారు. కాంట్రాక్టు ఉద్యోగులు ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.5 లక్షలు, సహజ మరణానికి రూ.2 లక్షలు పరిహారం అందించేలా ఉత్తర్వులు జారీ చేశారు.

రూ.249.35 కోట్ల మేర వేతనాల పెంపు

  • టీడీపీ ప్రభుత్వం కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాల కోసం ఏటా రూ.330.54 కోట్లు వెచ్చించేది. ఈ లెక్కన ఒక్కో కాంట్రాక్టు ఉద్యోగికి సగటు వేతనం రూ.15 వేలు మాత్రమే.
  • వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక వేతనాల పెంపుతో కాంట్రాక్టు ఉద్యోగుల జీతాల కోసం ఏటా వెచ్చించే మొత్తం రూ.579.89 కోట్లకు చేరింది. అంటే గత ప్రభుత్వంలో వెచ్చించిన మొత్తం కన్నా రూ.249.35 కోట్లు అదనం.
  • ఫలితంగా 18,060 మంది కాంట్రాక్టు ఉద్యోగులకు లబ్ధి కలిగింది. సగటున ఒక్కొక్కరికి నెలకు సరాసరిన అందే వేతనం దాదాపు రూ.26,758. ఈ ప్రభుత్వ చర్యల వల్ల 18 శాతం నుంచి 82 శాతం వరకు వేతనాలు పెరిగాయి.  
  • విద్యా శాఖ ఉద్యోగులకు భారీగా లబ్ధి
  • ఉన్నత విద్యా శాఖ కాలేజీ ఎడ్యుకేషన్లోని జూనియర్‌ లెక్చరర్లు, లెక్చరర్లు, లైబ్రేరియన్లు, ప్రొఫెసర్‌/ ఇతర ఫ్యాకల్టీకి సంబంధించి 691 మందికి ఎంటీఎస్‌ అమలవుతోంది.
  • ఇంటర్మీడియెట్‌ ఎడ్యుకేషన్ కు సంబంధించి జూనియర్‌ అసిస్టెంట్, జూనియర్‌ లెక్చరర్లు, ల్యాబ్‌ అసిస్టెంటు, లెక్చరర్లు ఇతర ఫ్యాకల్టీలో 3,728 మందికి వేతనాల పెంపు ద్వారా లబ్ధి చేకూరింది. సాంకేతిక విద్యా శాఖలోని ఎలక్ట్రీషియన్లు, ల్యాబ్‌ అసిస్టెంట్లు, లెక్చరర్లు, ఫార్మాసిస్టులు, వర్కుషాప్‌ అటెండెంట్లు తదితరులు 432 మందికి మేలు చేకూరుతోంది.
  • సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల విద్యా సంస్థలు, గిరిజన సంక్షేమ శాఖ గురుకుల విద్యాలయాలు, ఏపీ గురుకుల విద్యా సంస్థలు, కస్తూరిబా బాలికా విద్యాలయాలు, బీసీ సంక్షేమ శాఖ గురుకుల విద్యా సంస్థలు, ఏపీ వైద్య విధాన పరిషత్, స్పోర్ట్సు అథారిటీ ఆఫ్‌ ఏపీ విభాగాల్లోని 6,026 మందికి వేతనాల పెంపును అమలు చేస్తున్నారు.
  • యూనివర్సిటీల్లోని కాంట్రాక్టు అధ్యాపకులకు ఎంటీఎస్‌ అమల్లో గత ప్రభుత్వ తప్పిదాల వల్ల ఆటంకాలు ఎదురవుతున్నాయి. వీరు 4,077 మంది ఉండగా ఇప్పటికే జేఎన్ టీయూ కాకినాడ, జేఎన్ టీయూ అనంతపురం, ఆదికవి నన్నయ, శ్రీవెంకటేశ్వర వర్సిటీల్లో వేతనాలను రూ.40 వేల వరకు పెంచి అందిస్తున్నారు.
  • అవుట్‌సోర్సింగ్‌ సిబ్బందికి తొలగిన కష్టాలు
  • గత ప్రభుత్వ హయాంలో అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బంది విషయంలో అనేక అక్రమాలు, భారీగా అవినీతి చోటుచేసుకుంది.  అప్పటి సీఎం చంద్రబాబు తనకు సన్నిహితులైన వారికి ఏజెన్సీలను కట్టబెట్టారు.
  • ఈ ఏజెన్సీలు లక్షలు వసూలు చేసి పోస్టులు అమ్ముకున్నాయి. జీతాల్లో కోత పెట్టి ఎప్పుడో ఇచ్చే వారు. ఉద్యోగ భద్రత అసలు ఉండేది కాదు. పీఎఫ్, ఈఎస్‌ఐ వంటి సదుపాయాల్లేవు.
  • వీరి ఆవేదనను కళ్లారా చూసిన వైఎస్‌ జగన్ అధికారంలోకి రాగానే ఏజెన్సీలను రద్దు చేసి, ప్రత్యేకంగా అవుట్‌ సోర్సింగ్‌ కార్పొరేషన్ (ఏపీసీఓఎస్‌ –ఆప్కోస్‌– ఏపీ కార్పొరేషన్ ఫర్‌ అవుట్‌ సోర్స్‌డ్‌ సర్వీసెస్‌) ఏర్పాటు చేసి 1.20 లక్షలకు పైగా ఉద్యోగులను దాని పరిధిలోకి చేర్చారు.  ప్రతి నెల  నయాపైసా కోత లేకుండా నేరుగా వారి అకౌంట్లలో వేతనం పడేలా చేశారు. ఈఎస్‌ఐ, ఈపీఎఫ్‌   సదుపాయాలు కల్పించారు.

కాంట్రాక్టు ఉద్యోగులకు లబ్ధి ఇలా..

ప్రభుత్వ శాఖ

ఉద్యోగి హోదా

ఎంటీఎస్‌ అమలుకు ముందు వేతనం (రూ.లలో)

ఎంటీఎస్‌ అమలుతో పెరిగిన వేతనం (రూ.లలో)

పెరుగుదల శాతం

గిరిజన సంక్షేమ శాఖ

స్కూల్‌ అసిస్టెంట్‌

16,350

29,840

82.50765

సాంఘిక సంక్షేమ శాఖ

లైబ్రేరియన్

20,490

35,120

71.40068

సాంఘిక సంక్షేమ శాఖ (ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఈఎస్‌/బీసీ)

జూనియర్‌ లెక్చరర్‌

24,460

37,100

51.67621

ఇంటర్మీడియెట్‌ విద్యాశాఖ

జూనియర్‌ లెక్చరర్‌

27,000

37,100

37.40741

కాలేజీ విద్య శాఖ

లెక్చరర్‌

30,000

40,270

34.23333

ఏపీఆర్‌ఈఐఎస్‌

టీజీటీ

22,200

28,940

30.36036

ఏపీఆర్‌ఈఐఎస్‌

పీజీటీ

24,150

31,460

30.26915

సాంఘిక సంక్షేమ శాఖ (ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఈఎస్‌/బీసీ)

స్టాఫ్‌నర్స్‌

19,350

25,140

29.92248

సాంఘిక సంక్షేమ శాఖ (ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఈఎస్‌/బీసీ)

పీఈటీ

16,350

21,230

29.84709

గిరిజన సంక్షేమ శాఖ

ఎస్‌జీటీ

22,290

28,940

29.83401

సాంకేతిక విద్యా శాఖ

వర్కుషాప్‌ అటెండెంట్‌

12,000

15,460

28.83333

సాంఘిక సంక్షేమ శాఖ (ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఈఎస్‌/బీసీ)

పీజీటీ

24,460

31,460

28.61815

సాంకేతిక విద్యా శాఖ

లెక్చరర్‌ పాలిటెక్నికల్‌

28,000

35,120

25.42857

సాంఘిక సంక్షేమ శాఖ

హెల్త్‌ సూపర్వైజర్‌

17,925

22,460

25.29986

పబ్లిక్‌ హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌

ఎంహెచ్‌ఏ(మేల్‌)

22,900

28,450

24.23581

గిరిజన సంక్షేమ శాఖ ఏపీటీడబ్ల్యూఆర్‌ఈఐఎస్‌

జూనియర్‌ లెక్చరర్‌

15,000

17,890

19.26667

సాంఘిక సంక్షేమ శాఖ (ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఈఎస్‌/బీసీ)

టీజీటీ

24,460

28,940

18.31562

విభాగాల వారీగా కాంట్రాక్టు ఉద్యోగులకు కలిగిన లబ్ధి ఇలా..

విభాగం

ఉద్యోగుల సంఖ్య

ప్రస్తుతం ఒక్కో ఉద్యోగికి నెలవారీ వేతనం

ఏడాదికి గతంలో ఖర్చు (రూ.కోట్లలో)

ఏడాదికి ప్రస్తుత ఖర్చు (రూ.కోట్లలో)

అగ్రికల్చర్‌

1,695

15,000.00

17.37

30.47

హార్టికల్చర్‌

122

15,000.00

1.04

1.82

పశుసంవర్థక శాఖ

14

15,000.00

0.13

0.22

మత్స్యశాఖ

61

12,000.00

0.50

0.88

అటవీ శాఖ

265

22,460.00

2.80

4.90

కాలేజీ విద్య

691

40,700.00

19.01

33.35

ఇంటర్మీడియెట్‌ విద్య

3,728

37,100.00

94.43

165.67

ఏపీ వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్

36

16,400.00

0.40

0.71

ఆర్థిక శాఖ

5

2,30,595.00

0.43

0.76

సాధారణ పరిపాలనాశాఖ

5

50,000.00

0.17

0.30

సమాచార శాఖ

9

1,50,000.00

0.53

0.94

ఏసీబీ

1

25,000.00

0.02

0.03

రాజ్‌భవన్ సచివాలయం

7

1,02,000.00

0.37

0.65

విజిలెన్సు అండ్‌ ఎన్ ఫోర్సుమెంటు

2

73,452.00

0.09

0.16

ఏపీభవన్ ఢిల్లీ

15

1,85,000.00

0.57

1.00

మెడికల్‌ ఎడ్యుకేషన్

1,460

2,25,000.00

22.67

39.77

పబ్లిక్‌హెల్త్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌

4,627

1,30,000.00

90.56

158.88

ఫ్యామిలీ వెల్ఫేర్‌

77

53,495.00

1.57

2.75

ఆయుష్‌

55

37,100.00

0.91

1.59

పోలీసు విభాగం డీజీపీ

105

1,25,000.00

1.06

1.86

ఏపీఎస్‌పీ

69

28,000.00

0.59

1.03

గ్రౌండ్‌వాటర్‌

10

32,000.00

0.22

0.38

వాటర్‌రిసోర్సు

293

32,000.00

2.72

4.77

ఇరిగేషన్

79

12,000.00

0.65

1.14

ఇరిగేషన్

409

34,318.00

3.43

6.01

పోర్టుల డైరక్టరేట్‌

1

80,000.00

0.05

0.10

ఇండస్ట్రీస్‌

2

80,000.00

0.08

0.13

హేండ్లూమ్‌ టెక్స్‌టైల్స్‌

5

25,350.00

0.06

0.11

ఇన్సూరెన్సు మెడికల్‌ సర్వీస్‌

23

41,912.00

0.33

0.58

న్యాయశాఖ

5

56,960.00

0.12

0.22

హైకోర్టు

494

60,000.00

5.63

9.88

అడ్వొకేట్‌ జనరల్‌ (లా)

35

17,500.00

0.34

0.59

స్టేట్‌ లీగల్‌ సెల్‌ అథారిటీ

21

28,940.00

0.29

0.51

లెజిస్లేచర్‌ సచివాలయం

1

90,000.00

0.06

0.11

పంచాయతీరాజ్‌

1

15,000.00

0.01

0.02

పంచాయతీరాజ్‌ (ఇంజనీరింగ్‌)

80

38,000.00

1.74

3.04

రూరల్‌ వాటర్‌ సప్లయ్‌

84

37,100.00

1.84

3.23

రెవెన్యూ (సచివాలయం)

1

75,000.00

0.05

0.09

భూపరిపాలనా విభాగం

52

25,000.00

0.72

1.27

రిలీఫ్, డిజాస్టర్‌ మేనేజ్‌మెంటు

22

1,25,000.00

0.90

1.58

ఎంప్లాయ్‌మెంటు ట్రయినింగ్‌ విభాగం

585

29,760.00

8.27

14.52

సాంకేతిక విద్యాశాఖ

432

35,120.00

8.41

14.75

సోషల్‌ వెల్ఫేర్‌ విభాగం (సచివాలయం)

1

65,000.00

0.04

0.08

సోషల్‌ వెల్ఫేర్‌ విభాగం

6

1,52,500.00

0.23

0.41

గిరిజన సంక్షేమ శాఖ

1,984

1,10,000.00

34.19

59.98

మహిళా శిశుసంక్షేమ, అభివృద్ధి శాఖ

352

60,000.00

4.66

8.17

దివ్యాంగులు, సీనియర్‌ సిటిజన్ శాఖ

5

37,100.00

0.11

0.20

జువైనల్‌ సంక్షేమ విభాగం

4

18,400.00

0.05

0.09

యువజన సంక్షేమ శాఖ

1

16,400.00

0.01

0.02

యువజన సంక్షేమ, కల్చరల్‌ అఫైర్స్‌

23

10,000.00

0.10

0.17

మొత్తం

18,060

 

330.54

579.89


చదవండి:

IIIT: ట్రిపుల్‌ ఐటీ ప్రవేశాల కౌన్సెలింగ్‌ తేదీ వివరాలు

PGECET: పీజీసెట్‌–2021 ప్రారంభం

Published date : 25 Oct 2021 12:39PM

Photo Stories