Skip to main content

PG Reddy: న్యూబొప్పారం వాసికి చరిత్ర విభాగంలో డాక్టరేట్‌

సోన్‌: డిగ్రీ కళాశాలలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్న మండలంలోని న్యూబొ ప్పారం గ్రామానికి చెందిన పీజీరెడ్డి చరిత్ర విభాగంలో డాక్టరేట్‌ పొందారు.
Doctorate in history for Newbopparam resident
న్యూబొప్పారం వాసికి చరిత్ర విభాగంలో డాక్టరేట్‌

 ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్‌ జీ అంజయ్య పర్యవేక్షణలో ‘మధ్యయుగ ఆంధ్రదేశ్‌లోని (1000–1687 సీఈ) సాంఘిక, సాంస్కృతిక మరియు ఆర్థిక పరిస్థతులు’ అనే అంశంపై సుమారు 700 ఏళ్ల పరిస్థితుల గురించి విస్తృత స్థాయిలో పరిశోధన చేసి తన సిద్ధాంత గ్రంథాన్ని అందించారు. దీంతో అతడికి ఓయూ డీన్‌ అర్జున్‌రావు చేతులమీదుగా చరిత్ర విభాగంలో డాక్టరేట్‌ పట్టా పొందారు. ఈ సందర్భంగా జీపీ రెడ్డిని పలువురు గ్రామస్తులు అభినందించారు.

చదవండి: K Bhaskar: ఎస్సారార్‌ కళాశాల అధ్యాపకుడికి డాక్టరేట్‌

Published date : 20 Oct 2023 04:49PM

Photo Stories