Skip to main content

చెంచు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలి

మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ: తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకులాల్లో ప్రవేశం కోసం చెంచు విద్యార్థులు దరఖాస్తు చే సుకోవాలని టీడబ్ల్యూ గురుకులం ప్రాంతీయ సమన్వయ అధికారి కె.నాగార్జునరావు ఒక ప్రకటనలో సూచించారు.
Chenchu ​​students should apply
చెంచు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలి

2023–24 కు గాను మన్ననూరులోని టీటీడబ్ల్యూయూఆర్‌జేసీ (పీటీజీ– బీ) లో మూడో తరగతి ప్రవేశానికి 80 సీట్లు, నాలుగో తరగతిలో 60, ఐదో తరగతిలో 44, ఆరో తరగతిలో 56, ఏడో తరగతిలో 38, ఎనిమిదో తరగతిలో 50, తొమ్మిదో తరగతిలో 28 ఇలా మొత్తం 356 సీట్లు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. ఇక అచ్చంపేటలోని టీటీడబ్ల్యూఆర్‌ఎస్‌ (పీటీజీ–జీ) లో ఐదో తరగతి ప్రవేశానికి 80, ఆరో తరగతిలో 35, ఏడో తరగతిలో 24, ఎనిమిదో తరగతిలో 19 ఇలా మొత్తం 158 సీట్లు ఉన్నయని వివరించారు.

చదవండి:

EAMCET 2023: ఎంసెట్‌కు ఇన్ని లక్షల దరఖాస్తులు.. ఈసారి పరీక్ష ఇలా..

TSPSC: ‘అడ్డదారి అభ్యర్థుల’ గుర్తింపే లక్ష్యం

9,231 Jobs: అవరోహణ విధానంలో గురుకుల పోస్టుల భర్తీ

Fake Job Notification: ఉద్యోగాల పేరుతో నకిలీ వెబ్‌సైట్‌

రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు చెందిన చెంచు విద్యార్థులు వచ్చే నెల 20వ తేదీలోగా పూర్తి చేసిన దరఖాస్తులను సమర్పించాలని సూచించారు. ఎంపికై న వారికి ఉచిత వసతి, భోజనం, నోటు పుస్తకాలు, బెడ్స్‌, దుస్తులు అందజేస్తామని, పూర్తి వివరాలకు మన్ననూర్‌లోని ప్రిన్సిపాల్‌ (సెల్‌ నం. 9490957314), అచ్చంపేటలోని ప్రిన్సిపాల్‌ (సెల్‌ నం. 8333925372)ను సంప్రదించవచ్చని తెలిపారు.

 

Published date : 11 Apr 2023 05:24PM

Photo Stories