Skip to main content

Teachers: టీచర్ల పదోన్నతులకు బ్రేక్‌

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని వైఎస్సార్‌ కడప జిల్లా బద్వేలు అసెంబ్లీ ఉప ఎన్నిక నేపథ్యంలో మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కాండక్టు అమల్లో ఉండడంతో రాయలసీమ ప్రాంతంలోని నాలుగు జిల్లాల్లో టీచర్ల పదోన్నతుల ప్రక్రియ ఆగింది.
Teachers
టీచర్ల పదోన్నతులకు బ్రేక్‌

ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నందున వైఎస్సార్‌ కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో టీచర్లకు తలపెట్టిన పదోన్నతుల ప్రక్రియను తాత్కాలికంగా నిలుపుదల చేయాలని పాఠశాల విద్యాశాఖ ఆయా జిల్లాల అధికారులకు ఆదేశాలిచ్చింది. ఉప ఎన్నిక అనంతరం పదోన్నతుల ప్రక్రియను చేపట్టాలని సూచించింది.

చదవండి: 

Medical: వైద్య సీట్లపై గెజిట్‌ నోటిఫికేషన్

హైదరాబాద్‌లో సైతం పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసాం: ఆచార్య వై.నజీర్‌

Published date : 23 Oct 2021 03:01PM

Photo Stories