తెలంగాణ రాష్ట్రంలోని బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థులకు అధికారులు ఆంక్షలు విధించారు.
బాసర ట్రిపుల్ ఐటీలో ఫోన్లపై నిషేధం!
పరిమిత ప్రాంతాల్లో మాత్రమే సెల్ఫోన్లు వినియోగించాలని ఆఫీస్ ఆర్డర్ పేరుతో ఒక ప్రకటన విడుదల చేశారు. అకడమిక్ బిల్డింగ్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్, క్లాస్రూమ్, ల్యాబ్లో సెల్ఫోన్ వినియోగించొద్దని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆంక్షల ఉత్తర్వులపై స్పందించిన విద్యార్థి సంఘం ప్రతినిధులు ట్రిపుల్ ఐటీ యంత్రాంగం నియంతలా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఆంక్షలు విధించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలతో తాము అధైర్యపడబోమని తేల్చిచెప్పారు. విద్యార్థుల భవిష్యత్ కోసం ఇన్చార్జి వీసీగా బాధ్యతలు చేపట్టానని మభ్యపెట్టిన వెంకటరమణ తమ డిమాండ్లను నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. వెంటనే ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పర్మినెంట్ వీసీని నియమించే వరకు ఉద్యమం చేసేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.